29న వడ్లమూడిలో చంద్రబాబు బహిరంగ సభ - 'ఎన్టీఆర్ సభా ప్రాంగణం'గా నామకరణం - చంద్రబాబు బహిరంగ సమావేశం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 7:35 PM IST

TDP Leaders Arrangements in Vadlamudi: గుంటూరు జిల్లాలోని వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరాలయం సమీపంలో జరిగే చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభా స్థలానికి "ఎన్టీఆర్ సభా ప్రాంగణం" అని నామకరణం చేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29వ తేదీన చేబ్రోలు మండలంలో బాలకోటేశ్వరాలయం సమీపంలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు పరిశీలించారు.

ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రజా యాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తల తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్ రామాంజనేయులు, గుంటూరు ఇంఛార్జ్ మసీర్ అహ్మద్, మంగళగిరి టీడీపీ నేత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కుల మతాల మధ్య విభేదాలు సృష్టించి చిచ్చు పెట్టాలని సీఎం చూస్తున్నారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.