ఆటోలో ఆరు లక్షలు విలువ చేసే మద్యం తరలింపు-ఎస్ఈబీ అధికారులకు చిక్కిన డ్రైవర్ - illegal liquor - ILLEGAL LIQUOR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/640-480-21302560-thumbnail-16x9-liquor-case.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 4:19 PM IST
Police Caught Illegal Liquor Transportation Jaggayapeta in NTR Distirct : ఎన్టీఆర్ జిల్లాలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు 100 పెట్టెల మద్యం సీసాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీస్ అధికారులు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఆటోను, డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను కిరాయికి తీసుకొని 100 పెట్టెల మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తి తరలిస్తున్నట్లు జగ్గయ్య పేట పోలీసులు తెలిపారు. వారి గురించిన పూర్తి సమాచారం ఆటో డ్రైవర్ కూడా తెలియదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జగ్గయ్యపేట పోలీసు స్టేషన్ పరిధిలో 76 మద్యం కేసులు నమోదు అయ్యినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందులో 91 మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పోలీసుల బృందాన్ని ఆయన అభినందించారు.