ఆర్​ఎంపీ ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి - చర్యలకు డిమాండ్​ - Person Died Due to Injection

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 4:15 PM IST

thumbnail
కాలికి చిన్న గడ్డ- ఆర్​ఎంపీ వైద్యుడి ఇంజెక్షన్​- ఆపై ఏం జరిగిందంటే! (ETV Bharat)

Person Died Due to RMP Doctor Injection Reaction in Nuzendla at Palnadu District : పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో ఇంజెక్షన్‌ రియాక్షన్‌తో ఓ వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన తాటి శ్రీను కాలికి చిన్న గడ్డ రావడంతో రవ్వారంలోని ఆర్​ఎంపీ వైద్యుడు చిన్నికొండ మల్లికార్జున్‌రెడ్డి దగ్గరకు వెళ్లారు. మల్లికార్జున్‌రెడ్డి వైద్యం చేసి గడ్డని తొలగించారు. శ్రీను నొప్పిగా ఉందని చెప్పడంతో మల్లికార్జున్‌ ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్​ తీసుకున్న తరువాత శ్రీనుకు వాంతులు, శరీరంపై దద్దులు వచ్చాయని, దీంతో శ్రీనును వినుకొండ ప్రభుత్వ  వైద్యశాలకు తరలించగా అతను అక్కడ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్​ఎంపీ డాక్టర్  ఇచ్చిన ఇంజెక్షన్​ వికటించి శ్రీను చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శ్రీను మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్​ఎంపీ వైద్యుడి (RMP Doctor) పై కఠిన చర్యలు తీసుకుంటామని జీవీ ఆంజనేయులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.