తరగతి గదికి వెళ్లాల్సిన బాలిక ఊపిరి తీసుకుంది- తండ్రి అనారోగ్యంపై ఆందోళనే కారణమా? - ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 12:33 PM IST

Ninth-standard student dies by suicide in Andhra Pradesh's Alluru district : అల్లూరి జిల్లా అరకులోని గిరిజన బాలికల పాఠశాలలో వసంత అనే 9వ తరగతి విద్యార్థిని (Student) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు 3 రోజుల కిందట ఇంటికి వెళ్లిన విద్యార్థిని పాఠశాల వసతి గృహానికి వచ్చింది. అనంతరం బట్టలు మార్చుకొని తరగతి గదికి వస్తానని స్నేహితులతో చెప్పింది. ఎంతసేపటికీ తరగతికి రాకపోవడంతో బాలిక కోసం వసతి గృహానికి వచ్చిన విద్యార్థినులకు వసంత ఉరివేసుకుని కనిపించింది.

Student Suicide in Alluri District : భయాందోళనలకు గురైన విద్యార్థినులు పాఠశాల సిబ్బందికి సమాచారమిచ్చారు. విద్యార్థిని మృతికి కారణాలు తెలియరాలేదు. ఉరేసుకుని వేలాడుతున్న వసంతని కిందకి దింపి ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందింది. విద్యార్థిని ఆత్మహత్యను (Suicide) గురించిన వివరాల కోసం స్థానిక మహిళా ఎస్సై రేణుక, సిఐ రుద్ర శేఖరు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.