వాలంటీర్ల ద్వారా అధికార పార్టీకి లబ్ధి- వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి : నిమ్మగడ్డ రమేశ్​ - Nimmagadda Ramesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 5:09 PM IST

thumbnail

Nimmagadda Ramesh Commemt on Volunteers Election Campaign : వాలంటీర్లకు అధికార పార్టీతో అపవిత్ర బంధం ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు-అవినీతికి అడ్డుకట్ట అంశంపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ హాజరై మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా అధికార పార్టీ లబ్ధిపొందాలని చూస్తోందని నిమ్మగడ్డ అన్నారు. వాలంటీర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. 
 

సాక్షాత్తు సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ఎన్నికల్లో వాలంటీర్ల అవ్వతాతలతో ఓటు వేయించాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ గుర్తు చేశారు. వైసీపీ సీనియర్​ మంత్రి సివిల్​ సర్వీస్​ నిబంధనలు వాలంటీర్ల వర్తించవు, వారు ఎలక్షన్​ ఏజెంట్లుగా కూర్చొవచ్చునని పేర్కొన్న విషయాన్ని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సిటిజన్​ ఫర్​ డెమోక్రసీ హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. సిటిజన్​ ఫర్​ డెమోక్రసీ వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శి (సీఎస్​) ఆదేశించినట్లు తెలిపారు. సీఎస్​ కంటి తుడుపు చర్యగా ఓ మెమోను జారీ చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది వాలంటీర్లును మాత్రమే సస్పెండ్​ చేశారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.