'విద్యుత్ కొనుగోళ్లలో కమీషన్ల కక్కుర్తి- అప్రకటిత కోతలతో జనం అవస్థలు' - Brahmam On Power Cuts In AP
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 5:10 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-04-2024/640-480-21191552-thumbnail-16x9-nadendla-brahmam-on-power-cuts-in-ap.jpg)
Nadendla Brahmam On Power Cuts In AP : రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. జగన్ అసమర్థ నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
Nadendla Brahmam On Current Bills : ఎండలు ముదరక ముందే అప్రకటిత కోతలతో జగన్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక ధరల పెట్టి విద్యుత్ను కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. 2019 నాటికి 2080 మెగావాట్ల మిగులు విద్యుత్ను చంద్రబాబు జగన్కు అప్పగించారని తెలిపారు. జగన్ కమీషన్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై దాదాపు 20 వేల కోట్ల భారాలు మోపారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రజా సమ్యల పట్ల చిత్త శుద్దిలేదని విమర్శించారు.