తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదలకు పండగే: బొండా ఉమా - Bonda Uma about Anna Canteen - BONDA UMA ABOUT ANNA CANTEEN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 16, 2024, 3:35 PM IST
MLA Bonda Uma about Anna Canteen: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూతపడిన అన్న క్యాంటీన్ను త్వరలో తెరవనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లో తెలుగుదేశం నాయకులు ముందస్తుగా పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వయంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
"రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను తెరువనున్నారు. ఎందరో పేదవాళ్ల కడుపు నింపిన అన్న క్యాంటీన్లు పునఃప్రారంభానికి టీడీపీ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా స్థానిక టీడీపీ నాయకులమంతా కలిసి ఈ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. ఇది పేదల ప్రభుత్వం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదలకు పండగే." - బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే