LIVE: కేబినెట్ నిర్ణయాలపై కొలుసు పార్థసారథి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - KOLUSU PARTHASARATHY LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/640-480-23240534-thumbnail-16x9-kolusu-parthasarathy.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2025, 4:13 PM IST
|Updated : Jan 2, 2025, 4:46 PM IST
KOLUSU PARTHASARATHY LIVE: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అమరావతిలో 2 వేల 733 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్ను అమాత్యులు ఆమోదించారు. భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకున్నారు. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా కేబినెట్ చట్టసవరణ చేసింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడంతో పాటు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని ఆమోదించింది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఎస్ఐపీబీ ఆమోదించిన లక్షా 82 వేల 162 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 11 వందల 74 కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరిన్ని అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jan 2, 2025, 4:46 PM IST