దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై విచారణ: మంత్రి ఆనం - Minister Anam on Shanti - MINISTER ANAM ON SHANTI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 5:51 PM IST
Minister Anam Ramanarayana Reddy on Assistant Commissioner Shanti: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని వాటిపై విచారణ జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి నియామకం జరిగినప్పుడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో కీలకంగా ఉన్నారు. నియామకంలో తప్పులు జరిగితే పీఎస్సార్ కూడా బాధ్యుడే అవుతారని స్పష్టం చేసారు. శాఖాపర విచారణ పూర్తై, తగిన ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కొరతామన్నారు. విశాఖలో శాంతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు.
ప్రేమ సమాజం, ఇతర భూముల విషయంలో ఆమెపై ఉన్న ఆరోపణలపైనా విచారణ జరుగుతోందని వెల్లడించారు. విశాఖ భూ దందా వివాదాల్లో శాంతితో పాటు సుభాష్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులు పైనావిచారణ జరుగుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో 46ఆలయాలు పునర్నిర్మాణం చేయాలల్సి ఉందని ఇందుకు 36కోట్లు పరిహారం నిధులు వచ్చి ఉన్నాయన్నారు. ఆలయ నిర్మాణాలు జరిగితే నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేశారు.