టీడీపీలోకి భారీ చేరికలు- ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద సందడి - తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 12:07 PM IST
Massive Inflow from YSRCP TO TDP at chandrababu Home Undavalli : తెలుగుదేశం పార్టీలోకి చేరికలతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబు సమక్షంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas reddy) ప్రధాన అనుచరుడు చిన్నవెంకటరెడ్డి, పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జెడ్పీటీసీ సూరా దీప, కౌన్సిలర్ ప్రత్యూష, అద్దంకి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ యలమంద, కర్నూలు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు మహ్మద్ఖాసీంతో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు.
అద్దంకి నియోజకవరానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు, శాప్నెట్ ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్య చంద్రబాబుతో (Chandrababu Naidu) భేటీ అయ్యారు. అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్న కృష్ణచైతన్యను ఇటీవలే ఆ పార్టీ తప్పించి హనిమిరెడ్డిని నియమించింది. ఈ నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. తణుకు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ (YSRCP) నేత పేకేరు శ్రీను కూడా చంద్రబాబును కలిశారు.