టోల్ గేట్​ను తొలగింపుపై స్థానికుల హర్షం- మాట నిలబెట్టుకున్నారంటూ పల్లా కు ప్రశంసలు - removing toll gate at Aganampudi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 10:24 PM IST

thumbnail
టోల్ గేట్​ను తొలగించడంతో స్థానికులు హర్షం - ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా పల్లా శ్రీనివాసరావు (ETV Bharat)

Removing Toll Gate at Aganampudi in Visakhapatnam District : విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడి వద్ద ఉన్న టోల్ గేట్​ను తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక నాయకులు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోల్ గేట్​ను ఎత్తివేశారని గుర్తుచేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డబ్బులకు ఆశపడి టోల్ ప్లాజా యాజమాన్యంతో కుమ్మక్కై యథావిధిగా టోల్​ గేట్​ను పునరుద్ధరించారని తెలిపారు. దీనిపై స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇచ్చిన హామి మేరకు టోల్ గేట్​ను తొలగించారని ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ టోల్ గేట్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ హైవే వెంబడి లంకెలపాలెం, అగనంపూడి తదితర గ్రామాల ప్రజలు నిత్యం స్టీల్ ప్లాంట్, ఫార్మాసీటీ, గంగవరం పోర్ట్, కోరమండల్ తదితర కర్మాగారాలకు వెళుతుంటారన్నారు. స్థానికులు ఉద్యోగాల నిమిత్తం ఈ టోల్ గేట్ వెంట ప్రయాణం చేయవలసి వచ్చేది. అందుకుగాను రోజు టోల్ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడిందని వెల్లడించారు. దీని వల్ల స్థానికులు నిత్యం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోని రావడంతో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారం టోల్ గేట్​ను తొలగిండంచో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.