టీడీపీ శ్రేణులను కలుపుకొని వెళ్తా- విజయం సాధిస్తా: కొణతాల రామకృష్ణ - Konathala Ramakrishna Comments
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:53 PM IST
Konathala Ramakrishna worshipped at Nookambika temple: అనకాపల్లి టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి జనసేన నేత కొణతాల రామకృష్ణ పేరును ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో సంబరాలు మిన్నంటాయి. జనసేన-టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna ) పేరు ప్రకటించడంతో, ప్రచార పర్వాన్ని ప్రారంభించే ముందు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తెలుగుదేశం శ్రేణులను కలుపుకొని పనిచేస్తానని కొణతాల రామకృష్ణ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సమష్టిగా అభ్యర్థులను ఎంపిక చేశారన్నారని కొణతాల పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన (Janasena - TDP) కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇలాగే రాబోయే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఇరు పార్టీలకు చెందిన నేతలను కలుపుకొని ముందుకు సాగుతానని కొణతాల వెల్లడించారు.