రాష్ట్రానికి పునర్వైభవం- ఎన్డీఏ హామీల అమలు మొదలైంది : పవన్ కల్యాణ్ - Pawan Kalyan on Chandrababu Signs
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 10:21 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/640-480-21707497-thumbnail-16x9-pawan.jpg)
Janasena Chief Pawan Kalyan Comments on CM Chandrababu Naidu Signs on 5 Files : ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్లో తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు-రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ అయిదో సంతకం చేశారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని వెల్లడించారు. ప్రమాణస్వీకారం తర్వాత తననూ కలవడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.