2040 కల్లా చంద్రునిపై కాలు మోపడమే లక్ష్యం: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ - National Space Day Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 7:03 AM IST

thumbnail
2040 కల్లా చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ చెప్పారు: ఇస్రో ఛైర్మన్ (ETV Bharat)

ISRO Chairman in National Space Day Celebrations: చంద్రయాన్‌-3 స్ఫూర్తితో 2040 కల్లా చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని చెప్పారని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. తిరుపతి సమీపంలోని మోహన్‌ బాబు యూనివర్సిటీలో సతీష్‌ దావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం, జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రయాన్‌ -3 ప్రయోగాన్ని యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో సుమారు 7 లక్షల మంది వీక్షించారన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ కీర్తి పతాకాల్లో నిలిచిందని గుర్తు చేసుకున్నారు. కాగా భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 గతేడాది ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. 

"చంద్రయాన్‌-3 స్ఫూర్తితో 2040 కల్లా చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని యూట్యూబ్‌లో 7 లక్షల మంది వీక్షించారు. చంద్రయాన్‌-3 తర్వాత బ్రిక్స్‌ సమావేశాల్లో మోదీని హీరోలా చూశారు." - డా. ఎస్‌.సోమనాథ్‌, ఇస్రో ఛైర్మన్‌

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.