పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన - International Experts on Polavaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 9:57 PM IST

thumbnail
పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన (ETV Bharat)

International Water Resources Experts visit Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడాల నుంచి వచ్చిన నలుగురు నిపుణులు శనివారమే దిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం వచ్చి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ అధికారులతో భేటీ నిర్వహించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ పరిశీలన చేపట్టారు. తొలి రెండు రోజులు డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్​ల పరిశీలన కొనసాగనుంది. ప్రాజెక్టు డిజైన్ల మొదలు ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల తర్వాత కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర నిపుణులతో మేధోమథనం చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం జలసంఘం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.