ఐఏఎస్ అధికారుల బదిలీ- మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్​గా ఎన్.తేజ్ భరత్ - IAS Officers Transfer in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 8:39 AM IST

thumbnail
ఐఏఎస్ అధికారుల బదిలీలు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ (ETV Bharat)

IAS Officers Transfer in AP : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల చేసిన బదిలీల్లో ఒక మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్​గా ఎన్.తేజ్ భరత్​ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జాయింట్ కలెక్టర్​గా వి.అభిషేక్ ను నియమిచింది. పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రఖర్‌ జైన్‌ను నియమిస్తూ ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్​గా రాహుల్ మీనాను బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జేసీగా శివ నారాయణశర్మను నియమించారు. 

కర్నూలు మున్సిపల్ కమిషనర్​గా జి.విద్యాధర్ నీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం సబ్ కలెక్టర్​గా అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఆయనకే పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏటిపాక సబ్ కలెక్టర్​గా అపూర్వ భరత్​ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చింతూరు ఐటీడీఏ పీఓగాను అపూర్వ భరత్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.