ఓటర్లపై మాజీ ఎమ్మెల్యే యరపతినేని హామీల వర్షం - యరపతినేని శ్రీనివాసరావు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20659731-thumbnail-16x9-ex-mla-yarapathineni.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 10:29 PM IST
EX MLA Yarapathineni: గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన నియోజకవర్గంలోని ఓటర్లపై ఎన్నికల హామీల వర్షం కురిపించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం అధికారంలోనికి వస్తే నియోజకవర్గంలో 15వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే మూడు సిలిండర్లతోపాటు అదనంగా మరో సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో గురజాలలో బీసీలు అనేక అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక బీసీల గౌరవాన్ని పెంచే బాధ్యత తాను తీసుకుంటానని భరోసానిచ్చారు. 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు తెలిపారు.
"ఈ నాలుగున్నర వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పాలనలో బీసీలపై అనేక దాడులు జరిగాయి. అక్రమ మైనింగ్ వల్ల మరణాలు సంభవించాయి. మనకు ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఎక్కడైతే అవమానాలకు గురయ్యారో అక్కడే మీ గౌరవం నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా." - యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే