900 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది - అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు - Gandikota Koneru Dried - GANDIKOTA KONERU DRIED
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/640-480-21586384-thumbnail-16x9-erra-koneru-has-dried-up-in-gandikota-o--ysr-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 5:43 PM IST
Erra Koneru has Dried up in Gandikota of YSR District : పాలకుల నిర్లక్ష్యం వల్ల వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలోని ఎర్రకోనేరు ఎండిపోయింది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఒక్కసారిగా ఎండిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 900 ఏళ్లుగా కోనేరులో నీరు ఇంకిపోలేదని స్థానికులు తెలిపారు. నిత్యం నీటితో కళకళలాడేదని తెలిపారు. కరవు కోరల్లో చిక్కుకున్నప్పుడు సైతం కోనేరులో నీరు ఉండేదని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎర్రకోనేరు శిథిలావస్థకు చేరుకుంది. కోనేరు కట్టడం సైతం చాలావరకు ధ్వంసమై కళావిహీనంగా మారిందని స్థానికులు మండిపడ్డారు.
వర్షాలు లేక ఎండిపోయిన కోనేరులో పూడికతీత పనులు చేపట్టాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న గండికోటను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే యుద్ధం తర్వాత సైనికులు రక్తపు కత్తులు కడగడం వల్ల నీళ్లు ఎర్రగా మారాయని అందుకే ఈ కోనేటికి ఎర్ర కోనేరు లేక కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు.