వరద బాధితులకు ఈనాడు ఆపన్నహస్తం- జక్కంపూడి కాలనీలో ఇంటింటికీ ఆహారం అందజేత - Eenadu Help To Floos Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 6:05 PM IST

thumbnail
విజయవాడలోని వరద బాధితులకు తోడుగా నిలిచిన ఈనాడు (ETV Bharat)

Eenadu Help To Flood Victims in Vijayawada : బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడపై బుడమేరు విరుచుకుపడింది. ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోని విజయవాడలోని వరద బాధితులకు "ఈనాడు" సైతం తోడుగా నిలిచింది. 

రామోజీ గ్రూపు సంస్థల నుంచి జక్కంపూడి వైఎస్సార్ కాలనీని బాధితులకు ఆహారం, తాగునీటిని సరఫరా చేశారు. ట్రాక్టరులో ఆహారం ప్యాకెట్లు, తాగునీటి బాటిళ్లను తీసుకుని వరద ముంపు నుంచి ఇంకా బయటపడని జక్కంపూడి కాలనీకి రామోజీ గ్రూపు ఉద్యోగులు చేరుకున్నారు. ఆహారం-తాగునీరు అందని వరద ముంపు నివాసాల వద్దకు వెళ్లి వారికి నేరుగా అందించారు. వృద్ధులు, మహిళలు, పిల్లల చెంతకు చేరుకుని వారికి ఆహారం అందించి తోడుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.