బద్రీనాథ్ ఆలయంలో భక్తుల కోలాహలం- చార్​ధామ్​ యాత్రతో ఆధ్యాత్మిక రమణీయత - Devotees to Badrinath Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 1:49 PM IST

thumbnail
బద్రీనాథ్ ఆలయంలో భక్తుల కోలాహలం- చార్​ధామ్​ యాత్రతో ఆధ్యాత్మిక రమణీయత (ETV Bharat)

Devotees to Badrinath Temple : చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మంచు కొండల మధ్య బద్రీనాథ్ ఆలయ రమణీయతను, యాత్రికులు ఆస్వాదిస్తున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో తమకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని యాత్రికులు చెబుతున్నారు. మరింత సమాచారం బద్రీనాథ్ ఆలయం నుంచి ఈ టీవీ ప్రతినిధి మహేష్ అందిస్తారు.

ఆధ్యాత్మికత, ప్రకతి రమణీయత, ఆహ్లాదం భక్తులు కోలాహలంగానికి, సందడికి కేరాఫ్​గా నిలుస్తోంది  బద్రీనాథ్​ యాత్ర. దేవాలయంతో పాటు చుట్టు పక్కల మంచు శిఖరాల అందాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర దైవదర్శనానికి జనాలు క్యూలో ఉన్నారు. భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సి ఉండగా లక్షల్లో భక్తలు దర్శనానికి ఆసక్తి కనబరిచారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారిని మాత్రమే ఆలయ పరిసరాల్లోకి అధికారులు అనుమతిస్తున్నారు. ఎత్తైన కొండలు, పాలనురగల్లాంటి జలపాతాలు, చుట్టూ మంచుకొండలు ప్రకృతి ప్రేమికుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. విష్ణు క్షేత్రంలో భక్తులు దైవనామ స్మరణతో నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.