రా కదలిరా సభకు అడ్డంకులన్నీ దాటి ఏర్పాట్లు - టీడీపీ నేతలు - చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 11:39 AM IST
Chandrababu Naidu Ra Kadali Meeting : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ''రా కదలిరా '' భారీ బహిరంగ సభ నేడు బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరగనుంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్చురు నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఈ సభకు ప్రభుత్వం ఏర్పాట్ల దశ నుంచే ఆటంకాలు సృష్టించింది. అన్ని అడ్డుకులు అధిగమించి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ''రా కదలిరా '' భారీ బహిరంగ సభకు లక్ష మందికిపైగా హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు టీడీపీ పూర్తి చేశారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విషయాన్ని తెలియజేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసే దిశగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ టికెట్లు రాని నాయకులకు అధికారంలోకి రాగానే సముచిత ప్రాధాన్యమిస్తామని చెప్పారు.