thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 12:34 PM IST

ETV Bharat / Videos

విశాఖ జిల్లాలో భారీగా నగదు పట్టివేత - ఆధారాలు చూపకపోవడంతో ఏంచేశారంటే!

Cash Seized in Visakha: విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. నక్కపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టు వద్ద, సుమారు 2 కోట్ల 7 లక్షల వరకు నగదును పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్​ చేసినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని అనకాపల్లి, నక్కపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాగిత టోల్​ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు. 

ఈ క్రమంలో విశాఖ వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా, అందులో 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల నగదు లభ్యమైంది. దీంతో కారు డ్రైవర్​ను ప్రశ్నించగా, నగదు ఓ ధాన్యం వ్యాపారిదని సమాధానం ఇచ్చాడు. సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో, నగదుతో తరలిస్తున్న వాహనాన్ని సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందస్తుగా చెక్​పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు. గత రెండు వారాల కిందట నక్కపల్లి మండల పరిధిలో చెక్​ పోస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.