మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి - ATTACK ON MLA BROTHER IN LAW
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2024/640-480-22818096-thumbnail-16x9-macherla-mla-brother-in-law-attack.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2024, 2:40 PM IST
Attack on Macherla MLA Brother in Law : పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై గుంటూరులో దాడి జరిగింది. రవీంద్రానగర్కు చెందిన బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు టెంపుల్ టన్ అపార్టుమెంట్ నిర్మాణం కోసం కృష్ణారెడ్డి దగ్గర రూ.80 లక్షలు అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వరరావు గుంటూరులో ఉన్నట్లు తెలుసుకుని మాధవరావు అనే వ్యక్తితో కలిసి కృష్ణారెడ్డి వెళ్లారు.
ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యేశ్వరరావు, కుమారుడు రుషితోపాటు మరికొందరు యువకులతో కలిసి కృష్ణారెడ్డి, మాధవరావులపై కర్రలతో దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన కృష్ణారెడ్డి అనుచరులు, భజరంగ్ దళ్ నాయకుడు అనిల్ బెహరా రుషి బ్యాచ్పై ప్రతిదాడి చేశారు. ఈ ఘటనలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పట్టాభిపురం పోలీసులు ఇరువర్గాలను శాంతిపజేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణారెడ్డి, మాధవరావు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.