thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ETV Bharat / Videos

జీవీఎంసీ సమావేశంలో వైఎస్సార్​సీపీ కార్పొరేటర్ నోటిదురుసు - తోపులాట - Argument in GVMC Meeting

Argument Between YSRCP and Alliance Leaders in GVMC Meeting : విశాఖ మహానగర పాలక సంస్థ (Greater Visakha Municipal Corporation) కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్​సీపీ కార్పొరేటర్‌ బాణాల శ్రీనివాస్‌ నోటి దురుసు తోపులాటకు దారి తీసింది. వైఎస్సార్​సీపీ నేతలు, కూటమి నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లారు. సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ను వైఎస్సార్​సీపీ కార్పొరేటర్‌ బాణాల శ్రీనివాస్‌ క్రిమినల్‌ అంటూ దూషించారు. దీంతో బాణాలు శ్రీనివాస్ మూర్తియాదవ్​కు క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేట్లరు పట్టు బట్టారు. మేయర్ పోడియంను కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టారు. మూర్తి యాదవ్​ని క్రిమినల్ అని సంభోదించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని పొడియం దగ్గరే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్​సీపీ కార్పొరేటర్లు జైన్, పీవీ సురేష్, కూటమి కార్పొరేటర్లు మూర్తి యాదవ్, బొమ్మిడి రమణ, లేళ్ల కొటేశ్వరరావు మధ్య తోపులాట జరిగింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.