ETV Bharat / state

గాంజా రవాణాపై విజయనగరం పోలీసులు సీరియస్- పీడీ యాక్ట్ నమోదుకూ సిద్ధం - Police to control marijuana

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 1:47 PM IST

Vizianagaram police raids on ganja : విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించటంపైనా ఎస్పీ వకుల్ జిందల్ దృష్టి సారించారు. ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపారు.

vizianagaram_police_raids_on_ganja
vizianagaram_police_raids_on_ganja (ETV Bharat)

Vizianagaram police raids on ganja : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా, వాడకాన్ని కట్టడి చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో పోలీసు శాఖ కూడా వీటి నియంత్రణపై దృష్టి సారించింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిఘా పెంచారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను పెంచి., తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా పాత నేరస్తులు, అనుమానితులపై సస్పెక్టెడ్ షీట్ లు తెరిచేందుకు సమాయత్తమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదుకూ వెనుకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.

అరకు టూ దిల్లీ - 22కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్​ - Police Seized 22kg of Ganja

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. గంజాయి ఏ మాత్రం రవాణా జరుగుతున్నా గుర్తిస్తున్నారు. గత శనివారం అరకు నుంచి ద్విచక్రవాహనాలతో వస్తున్న ఇద్దరు యువకులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద గంజాయితో పట్టుబడ్డారు. అదేవిధంగా మూడు రోజుల కిందట ఎస్.కోట ఆర్టీసీ బస్టేషన్ వద్ద గంజాయి బ్యాగులతో పలువురు పోలీసులకు చిక్కారు. రెండు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యాటక ప్రాంతం నుంచి ఓ లారీ వస్తోంది. గంజాయిని తరలించే వాహనంగా అనుమానించిన పోలీసులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద అడ్డగించారు. డ్రైవర్ వాహనాన్ని అపకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు లక్కవరపుకోట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన చోధకుడు కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. ఈ వాహనంలో సుమారు 450కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించటంపైనా ఎస్పీ వకుల్ జిందల్ దృష్టి సారించారు. ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపారు. ఇటీవల జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఐదుగురు ఎస్ఐలతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒడిశా, చత్తీస్ ఘడ్, దిల్లీ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి, గంజాయి కేసులతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల సమాచారాన్ని రాబట్టనున్నాయి. ఈ బృందాలు గంజాయి కేసుల్లో సాధించిన సమాచారాన్ని మరింత విస్తృతం చేసి, ఆయా కేసులతో ప్రమేయం ఉన్న సూత్రధారులు, ఇతర నిందితుల లింకులను చేధించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

గంజాయి రవాణాను గత ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో స్థానికంగా ఉన్న యువత కూడా దీని వినియోగానికి అలవాటు పడింది. గంజాయి రవాణా చేస్తే వేలు, లక్షల్లో డబ్బులు కమీషన్ గా ముట్టచెబుతున్నారు. ఈ పరిణామాలపైనా ఎస్పీ దృష్టి సారించారు. మత్తు పదార్ధాల వినియోగం ద్వారా వచ్చే దుష్పరిణామాలు, భవిషత్తు నష్టాలపై యువతకు ముఖ్యంగా విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు సంకల్ప అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సంకల్ప ద్వారా విద్య సంస్థల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి., పోటీ పరీక్షలు సైతం నిర్వహించేందుకు విజయనగరంజిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కార్యచరణ సిద్ధం చేశారు.

డ్రగ్స్‌ నియంత్రణకు పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌- గాంజా సమాచారమిస్తే గిఫ్ట్ - Govt Focus Eradicate Drugs

మన్యం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత - ఒక వ్యక్తి అరెస్ట్ - Police Seized Ganja

Vizianagaram police raids on ganja : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా, వాడకాన్ని కట్టడి చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో పోలీసు శాఖ కూడా వీటి నియంత్రణపై దృష్టి సారించింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిఘా పెంచారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను పెంచి., తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా పాత నేరస్తులు, అనుమానితులపై సస్పెక్టెడ్ షీట్ లు తెరిచేందుకు సమాయత్తమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదుకూ వెనుకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.

అరకు టూ దిల్లీ - 22కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్​ - Police Seized 22kg of Ganja

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. గంజాయి ఏ మాత్రం రవాణా జరుగుతున్నా గుర్తిస్తున్నారు. గత శనివారం అరకు నుంచి ద్విచక్రవాహనాలతో వస్తున్న ఇద్దరు యువకులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద గంజాయితో పట్టుబడ్డారు. అదేవిధంగా మూడు రోజుల కిందట ఎస్.కోట ఆర్టీసీ బస్టేషన్ వద్ద గంజాయి బ్యాగులతో పలువురు పోలీసులకు చిక్కారు. రెండు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యాటక ప్రాంతం నుంచి ఓ లారీ వస్తోంది. గంజాయిని తరలించే వాహనంగా అనుమానించిన పోలీసులు శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్టు వద్ద అడ్డగించారు. డ్రైవర్ వాహనాన్ని అపకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు లక్కవరపుకోట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన చోధకుడు కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. ఈ వాహనంలో సుమారు 450కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించటంపైనా ఎస్పీ వకుల్ జిందల్ దృష్టి సారించారు. ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపారు. ఇటీవల జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఐదుగురు ఎస్ఐలతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒడిశా, చత్తీస్ ఘడ్, దిల్లీ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి, గంజాయి కేసులతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల సమాచారాన్ని రాబట్టనున్నాయి. ఈ బృందాలు గంజాయి కేసుల్లో సాధించిన సమాచారాన్ని మరింత విస్తృతం చేసి, ఆయా కేసులతో ప్రమేయం ఉన్న సూత్రధారులు, ఇతర నిందితుల లింకులను చేధించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

గంజాయి రవాణాను గత ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో స్థానికంగా ఉన్న యువత కూడా దీని వినియోగానికి అలవాటు పడింది. గంజాయి రవాణా చేస్తే వేలు, లక్షల్లో డబ్బులు కమీషన్ గా ముట్టచెబుతున్నారు. ఈ పరిణామాలపైనా ఎస్పీ దృష్టి సారించారు. మత్తు పదార్ధాల వినియోగం ద్వారా వచ్చే దుష్పరిణామాలు, భవిషత్తు నష్టాలపై యువతకు ముఖ్యంగా విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు సంకల్ప అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సంకల్ప ద్వారా విద్య సంస్థల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి., పోటీ పరీక్షలు సైతం నిర్వహించేందుకు విజయనగరంజిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కార్యచరణ సిద్ధం చేశారు.

డ్రగ్స్‌ నియంత్రణకు పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌- గాంజా సమాచారమిస్తే గిఫ్ట్ - Govt Focus Eradicate Drugs

మన్యం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత - ఒక వ్యక్తి అరెస్ట్ - Police Seized Ganja

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.