ETV Bharat / state

డబ్బులు లేకుండా చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు - మే 1నే పింఛన్ ఇవ్వాలి: దేవినేని ఉమ - Devineni Uma on Pension

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:51 PM IST

TDP Devineni Uma on Pension Distribution: గతంలో కాకుండా ఈసారైనా మే 1న పింఛన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఏప్రిల్ నెలలో సీఎస్‌, సెర్ఫ్ సీఈవో నిర్ణయాలతో పింఛన్‌దారుల ఇబ్బందులు పడ్డారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకుండా చేసి వృద్ధుల ప్రాణాలు తీశారని విమర్శించారు.

TDP_Devineni_Uma_on_Pension_Distribution
TDP_Devineni_Uma_on_Pension_Distribution

TDP Devineni Uma on Pension Distribution: గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా మే 1నే పింఛన్ దారులకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఈ నెలలో సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో పింఛన్ దారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయని, వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.

మార్చి చివరి వారంలో వైసీపీ ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు 14 వేల కోట్లు చెల్లించారని, ఏప్రీల్​లో పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకుండా చేసి 60 మంది వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మార్చిలోనే చెప్పినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సిబ్బంది ఉన్నా శవరాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీపై వెంటనే చీఫ్ సెక్రటరీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంటింటికి పింఛన్ ఇచ్చేలా ప్రధాన ఎన్నికల అధికారిని కోరతామన్నారు. పింఛన్​ను 200 నుంచి 2000 లకు పెంచి ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం చేశారు. పెంచిన పింఛన్ ఇవ్వడానికి జగన్​కు 58 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. 7 లక్షల కోట్ల బడ్జెట్​లో టీడీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు 20 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వగా, 12 లక్షల కోట్ల బడ్జెట్​లో వైసీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కొత్త పింఛన్​లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్​డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay

కాగా ఆంధ్రప్రదేశ్​లో పెన్షన్ల పంపిణీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ తీరు కారణంగా పలువురు పెన్షనర్లు చనిపోయారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలక్షన్ కమిషన్​కి లేఖ సైతం రాశారు. అదే విధంగా కూటమి నేతలు సైతం ఈ విషయాన్ని కేంద్ర మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ సీఎస్​పై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో తెలిపారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ దీనిపై స్పందించారు. మే నెలలో అయినా పింఛన్ 1వ తేదీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్​ నుంచే 4 వేల రూపాయల పింఛన్ - అదీ ఇంటి వద్దే : అచ్చెన్నాయుడు - TDP Atchannaidu on Pensions

TDP Devineni Uma on Pension Distribution: గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా మే 1నే పింఛన్ దారులకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఈ నెలలో సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో పింఛన్ దారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయని, వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.

మార్చి చివరి వారంలో వైసీపీ ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు 14 వేల కోట్లు చెల్లించారని, ఏప్రీల్​లో పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకుండా చేసి 60 మంది వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మార్చిలోనే చెప్పినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సిబ్బంది ఉన్నా శవరాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీపై వెంటనే చీఫ్ సెక్రటరీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంటింటికి పింఛన్ ఇచ్చేలా ప్రధాన ఎన్నికల అధికారిని కోరతామన్నారు. పింఛన్​ను 200 నుంచి 2000 లకు పెంచి ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం చేశారు. పెంచిన పింఛన్ ఇవ్వడానికి జగన్​కు 58 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. 7 లక్షల కోట్ల బడ్జెట్​లో టీడీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు 20 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వగా, 12 లక్షల కోట్ల బడ్జెట్​లో వైసీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కొత్త పింఛన్​లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్​డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay

కాగా ఆంధ్రప్రదేశ్​లో పెన్షన్ల పంపిణీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ తీరు కారణంగా పలువురు పెన్షనర్లు చనిపోయారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలక్షన్ కమిషన్​కి లేఖ సైతం రాశారు. అదే విధంగా కూటమి నేతలు సైతం ఈ విషయాన్ని కేంద్ర మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ సీఎస్​పై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో తెలిపారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ దీనిపై స్పందించారు. మే నెలలో అయినా పింఛన్ 1వ తేదీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్​ నుంచే 4 వేల రూపాయల పింఛన్ - అదీ ఇంటి వద్దే : అచ్చెన్నాయుడు - TDP Atchannaidu on Pensions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.