ETV Bharat / state

బదిలీపై టీచర్ వేరే స్కూల్​కు- మాస్టారు వెంటే మేమంటూ 133 మంది విద్యార్థులు టీసీలు తీసుకున్న వైనం - STUDENTS TRANSFERRED WITH TEACHER

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 6:15 PM IST

Updated : Jul 4, 2024, 6:21 PM IST

Students Tear Up On Teacher Transfers: ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతుంటారు. వారిని చుట్టుముట్టి కన్నీటి పర్యంతం అవుతారు. తెలంగాణలోని ఓ పాఠశాల విద్యార్దుల అలా కాకుండా మాస్టారు వెంటే మేము అంటూ ఏకంగా 133 మంది విద్యార్థులు బదిలీ అయిన టీచర్ స్కూల్ కు వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో పిల్లలు కూడా వేరే స్కూలు వెళ్లిపోవడంతో ఆ పాఠశాల బోసిపోయింది. వివరాల్లోకి వెళ్తే...

Students_Emotional_on_Teacher_Transfer_in_Mancherial
Students_Emotional_on_Teacher_Transfer_in_Mancherial (ETV Bharat)

Students Emotional on Teacher Transfer in Mancherial: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు గురువును విడిచి ఉండలేకపోయారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు తమ గురువు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పి ఆయన బదిలీ అయిన పాఠశాలలో చేరారు. ఈ అరుదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే జన్నారం మండలం పొనకల్​ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్​ 2012 జులైన 13న చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా అందులో ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ స్కూల్​లోని పిల్లలతో ఆ టీచర్​ ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించేవారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 32 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య 250కి చేరింది.

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు - ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు - Class Room Roof Fell Down in Kadapa

ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఆయన ఈనెల 1న ఇదే మండలంలోని మూడు కిలోమీటర్ల దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ముందు పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామాన్ని తట్టుకోలేక ఏడ్చారు. తమ మాస్టారు ఎక్కడ ఉంటే అక్కడే చేరతామని పిల్లలు గొడవ చేయడంతో 2,3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. దీంతో అంతకు ముందు కేవలం 21 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నేడు 154 మందితో కళకళలాడుతోంది. కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

మీరు మరో చోటుకు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు : మరోవైపు నిర్మల్​ జిల్లా మామడ మండలం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు శిరీష్​ కుమార్​, ప్రకాశ్​ రావు, శ్రీకర్​ బదిలీపై వేరొక చోటు వెళ్తున్న క్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై మీరు మరో చేటుకు వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ బోరున విలపించారు. వారికి ఉపాధ్యాయులంతా కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

12 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు : నల్కొండ జిల్లా నార్కట్​పల్లి ప్రాథమిక పాఠశాలలో వినీత అనే ఉపాధ్యాయురాలు 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా బదిలీపై మరో పాఠశాలకు వెళ్లనున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై తమను విడిచి వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. పాఠశాలలో అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోలు బాంబుతో దాడి - ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ - Petrol Bomb Attack in TEACHER HOUSE

Students Emotional on Teacher Transfer in Mancherial: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు గురువును విడిచి ఉండలేకపోయారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు తమ గురువు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పి ఆయన బదిలీ అయిన పాఠశాలలో చేరారు. ఈ అరుదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే జన్నారం మండలం పొనకల్​ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్​ 2012 జులైన 13న చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా అందులో ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ స్కూల్​లోని పిల్లలతో ఆ టీచర్​ ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించేవారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 32 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య 250కి చేరింది.

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు - ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు - Class Room Roof Fell Down in Kadapa

ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఆయన ఈనెల 1న ఇదే మండలంలోని మూడు కిలోమీటర్ల దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ముందు పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామాన్ని తట్టుకోలేక ఏడ్చారు. తమ మాస్టారు ఎక్కడ ఉంటే అక్కడే చేరతామని పిల్లలు గొడవ చేయడంతో 2,3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. దీంతో అంతకు ముందు కేవలం 21 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నేడు 154 మందితో కళకళలాడుతోంది. కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

మీరు మరో చోటుకు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు : మరోవైపు నిర్మల్​ జిల్లా మామడ మండలం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు శిరీష్​ కుమార్​, ప్రకాశ్​ రావు, శ్రీకర్​ బదిలీపై వేరొక చోటు వెళ్తున్న క్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై మీరు మరో చేటుకు వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ బోరున విలపించారు. వారికి ఉపాధ్యాయులంతా కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

12 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు : నల్కొండ జిల్లా నార్కట్​పల్లి ప్రాథమిక పాఠశాలలో వినీత అనే ఉపాధ్యాయురాలు 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా బదిలీపై మరో పాఠశాలకు వెళ్లనున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై తమను విడిచి వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. పాఠశాలలో అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోలు బాంబుతో దాడి - ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ - Petrol Bomb Attack in TEACHER HOUSE

Last Updated : Jul 4, 2024, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.