Postponement of DSC Due to Election Code in AP : 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. 2024 ఎన్నికలకు ముందు నిద్ర లేచి, డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి నెల ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా, ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయచిక్కుల కారణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసాగింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది.
ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించిన జగన్ సర్కార్ ఆ ప్రక్రియ ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు కావాలనే అర్హతల్లో అయోమయం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించింది. బీఎడ్ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని జనవరి 26న జీవో 4ను జారీ చేశారు. తర్వాత ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించారు. 17 రోజుల్లోనే రెండు విరుద్ధ నిర్ణయాలను ప్రకటించారు.
టీఆర్టీ నిర్వహణపై హడావిడి ఎందుకు? పరీక్ష షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశం
ఈ గందరగోళంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో డీఎస్సీ పరీక్షను మార్పు చేసింది. మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రకటించింది.