ETV Bharat / state

మన్యంపై డెంగీ పంజా - బాధితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు - Dengue Fevers in Manyam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

People Suffering From Dengue Fevers in Manyam District : మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మన్యంవాసులు డెంగీబారిన పడుతున్నారు. దీనికి తోడు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు సుదూరంగా ఉండటం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటుకున్నారు.

DENGUE FEVERS IN MANYAM
DENGUE FEVERS IN MANYAM (ETV Bharat)

People Suffering From Dengue Fevers in Manyam District : మన్యం జిల్లా వాసులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. మొన్నటి వరకు విషజ్వరాలు.నిన్న మలేరియా. తాజాగా డెంగీ జ్వరాలు ప్రజలను గడగడా వణికిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

గడగడలాడిస్తున్న డెంగీ జ్వరాలు : పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,264 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆగస్టులో అత్యధికంగా 620 మంది వ్యాధితో మంచం పట్టారు. ఈ నెలలో ఆ సంఖ్య కొంతమేర తగ్గింది. అంతలోనే చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. జనవరి నుంచి జులై వరకు కేవలం 21 మంది వ్యాధి బారిన పడగా గత నెలలో 42 మంది డెంగీతో మంచం పట్టారు.

డెంగీ జ్వరం వచ్చినట్లు ఎలా తెలుస్తుంది- ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి? - Dengue Severe symptoms

డెంగీ బారిన పడుతున్న జనం : ఆకస్మికంగా అధిక జ్వరం రావటం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, కీళ్లనొప్పులు, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దర్లు, ఆకలి మందగించటం వంటి లక్షణాలతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చికిత్స పొందినా, జ్వరాల తీవ్రత తగ్గక పోవటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి, పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రులకు రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి డెంగీ జ్వరం వచ్చింది. రోజు కూలీకి వెళ్లి సంపాదించిన సొమ్ము అంత ఇందుకే ఖర్చు చేస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కేంద్రాలు చాలా దూరంలో ఉన్నాయి. పరీక్ష కేంద్రాలు మాకు దగ్గరల్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం-బాధితులు

వరదలు వదల్లేదు- జ్వరాలు స్వారీ కి సిద్ధమయ్యాయి - Prathidhwani on How to be Healthy

డెంగీ నియంత్రణకు చర్యలు : ప్రస్తుతం మలేరియా తీవ్రత తగ్గుముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. జిల్లాలో డెంగీ నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని మండల కేంద్రాల్లోనే నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP

People Suffering From Dengue Fevers in Manyam District : మన్యం జిల్లా వాసులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. మొన్నటి వరకు విషజ్వరాలు.నిన్న మలేరియా. తాజాగా డెంగీ జ్వరాలు ప్రజలను గడగడా వణికిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

గడగడలాడిస్తున్న డెంగీ జ్వరాలు : పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,264 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆగస్టులో అత్యధికంగా 620 మంది వ్యాధితో మంచం పట్టారు. ఈ నెలలో ఆ సంఖ్య కొంతమేర తగ్గింది. అంతలోనే చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. జనవరి నుంచి జులై వరకు కేవలం 21 మంది వ్యాధి బారిన పడగా గత నెలలో 42 మంది డెంగీతో మంచం పట్టారు.

డెంగీ జ్వరం వచ్చినట్లు ఎలా తెలుస్తుంది- ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి? - Dengue Severe symptoms

డెంగీ బారిన పడుతున్న జనం : ఆకస్మికంగా అధిక జ్వరం రావటం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, కీళ్లనొప్పులు, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దర్లు, ఆకలి మందగించటం వంటి లక్షణాలతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చికిత్స పొందినా, జ్వరాల తీవ్రత తగ్గక పోవటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి, పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రులకు రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి డెంగీ జ్వరం వచ్చింది. రోజు కూలీకి వెళ్లి సంపాదించిన సొమ్ము అంత ఇందుకే ఖర్చు చేస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కేంద్రాలు చాలా దూరంలో ఉన్నాయి. పరీక్ష కేంద్రాలు మాకు దగ్గరల్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం-బాధితులు

వరదలు వదల్లేదు- జ్వరాలు స్వారీ కి సిద్ధమయ్యాయి - Prathidhwani on How to be Healthy

డెంగీ నియంత్రణకు చర్యలు : ప్రస్తుతం మలేరియా తీవ్రత తగ్గుముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. జిల్లాలో డెంగీ నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని మండల కేంద్రాల్లోనే నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.