ETV Bharat / state

తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 10:00 AM IST

Updated : Jul 27, 2024, 12:25 PM IST

People Suffering Due to Godavari Floods in AP : వానొస్తే వణుకు. వరదొస్తే బతుకు బితుకు. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. ఎటు వెళ్లాలన్నా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాలకు ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

godavari_floods
godavari_floods (ETV Bharat)
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు (ETV Bharat)

People Suffering Due to Godavari Floods in AP : వరద ఉద్ధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు : కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిళేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు, రామచంద్రపురం, కె. గంగవరం మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. లంకలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మండలాల పరిధిలోని లంకలు రోజుల తరబడి నీటిలోనే నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

అవస్థలు పడుతున్న ప్రజలు : పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడుమూడిలంక , అరిగులవారిపేట, జీ పెదపూడిలంక వాసులు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయనదీ తీరంలోని శివాయిలంక, పీ ఏనుగుపల్లి లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి. శివాయిలంక వాసులు నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల మధ్య దారి ఇరుకుగా ఉండటంతో మర పడవలు ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొంది. రహదారి ఎత్తు పెంచితే తమ కష్టాలు తీరతాయని శివాయిలంక వాసులు చెబుతున్నారు.

"రోడ్లు లేవు. వరద వచ్చినప్పుడు ఎవరైన వచ్చి చూసి వెళ్లిపోతారు. మేము ఇలాగే ఎన్నో రోజులు నీటిలోనే ఉంటాము. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎక్కడికి వెళ్లాలన్నా పడవలోనే ప్రయాణించాలి. ఇప్పటికైనా అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకొని సీసీ రోడ్డును వేయించాల్సిందిగా కోరుకుంటున్నాం"_బాధితులు, శివాయిలంక గ్రామస్థులు

కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గోదావరి వరద- నీళ్లలో నానుతున్న ఇళ్లు, పొలాలు - Heavy Rains In Konaseema District

ప్రభుత్వ సహాయం : ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు (ETV Bharat)

People Suffering Due to Godavari Floods in AP : వరద ఉద్ధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు : కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిళేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు, రామచంద్రపురం, కె. గంగవరం మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. లంకలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మండలాల పరిధిలోని లంకలు రోజుల తరబడి నీటిలోనే నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

అవస్థలు పడుతున్న ప్రజలు : పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడుమూడిలంక , అరిగులవారిపేట, జీ పెదపూడిలంక వాసులు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయనదీ తీరంలోని శివాయిలంక, పీ ఏనుగుపల్లి లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి. శివాయిలంక వాసులు నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల మధ్య దారి ఇరుకుగా ఉండటంతో మర పడవలు ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొంది. రహదారి ఎత్తు పెంచితే తమ కష్టాలు తీరతాయని శివాయిలంక వాసులు చెబుతున్నారు.

"రోడ్లు లేవు. వరద వచ్చినప్పుడు ఎవరైన వచ్చి చూసి వెళ్లిపోతారు. మేము ఇలాగే ఎన్నో రోజులు నీటిలోనే ఉంటాము. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎక్కడికి వెళ్లాలన్నా పడవలోనే ప్రయాణించాలి. ఇప్పటికైనా అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకొని సీసీ రోడ్డును వేయించాల్సిందిగా కోరుకుంటున్నాం"_బాధితులు, శివాయిలంక గ్రామస్థులు

కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గోదావరి వరద- నీళ్లలో నానుతున్న ఇళ్లు, పొలాలు - Heavy Rains In Konaseema District

ప్రభుత్వ సహాయం : ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

Last Updated : Jul 27, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.