ETV Bharat / state

వంతెనల నిర్వాహణలో జగన్​ జాప్యం-ప్రమాదం అంచున నిత్యం రాకపోకలు - PEOPLE SUFFER DUE TO DAMAGED BRIDGE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 2:14 PM IST

People Suffer Due to Damaged Bridge in Anantapur District : వైఎస్సార్సీపీ జాప్యం కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వంతెన నిర్మాణ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. గతేడాది చివర్లో వంతెన పునర్నిర్మాణం పేరిట నిధులు విడుదల చేసిన సకాలంలో పనులు పూర్తిచేయకపోయింది. దీంతో వావానదారులు నిత్యం ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.

Damaged Bridge in Anantapur
Damaged Bridge in Anantapur (ETV Bharat)

People Suffer Due to Damaged Bridge in Anantapur District : గత ఐదేళ్లలో చిన్నపాటి మరమ్మతులు చేయాల్సిన వంతెనల నిర్వహణ గాలికివదిలేయటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల వంతెనలు కూలిపోయాయి. ముదిగుబ్బ మండలంలో 20గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేసే మద్దిలేరువాగువంతెన 2021లో కూలిపోయింది. తాత్కాలిక మరమ్మతుల చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మమ అనిపించింది. గతేడాది చివర్లో వంతెన పునర్నిర్మాణం పేరిట నిధులు విడుదల చేసి గుత్తేదారుకు పనులు అప్పగించినా పూర్తికాలేదు. దీంతో వంతెనపై ప్రమాదకరంగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

దశాబ్దాల పాటు వాడుకుని డంపింగ్ యార్డుగా మార్చేశారు- ఆరేళ్లుగా ప్రజల అవస్థలు - Bayaneru Bridge Damaged

వంతెనల నిర్వాహణ జగన్​ సర్కారు జాప్యం : శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి సమీపంలోని మద్దిలేరువాగు వంతెన ప్రమాదకరంగా మారింది. 20 గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్న రోడ్డు 2021 నవంబర్‌లో భారీ వరద ప్రవాహానికి కుప్పకూలిపోయింది. ఈ వంతెనకు సంబంధించిన పిల్లర్లు, బీమ్స్ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఒత్తిడి తీసుకురావటంతో కొట్టుకుపోయిన వంతెన భాగంలో మట్టిపోసి తాత్కాలికంగా రాకపోకలు పునరుద్ధరించారు. రెండు సంవత్సరాల పాటు ప్రజలు అధికారులు చుట్టూ తిరగటంతో తప్పని పరిస్థితిలో ప్రభుత్వం వంతెన పునర్నిమాణానికి రూ.2 కోట్ల మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి గుత్తేదారును ఎంపిక చేసి గడువులోపు పనులు పూర్తిచేయలేదంటూ కాంట్రాక్ట్‌ రద్దు చేశారు. రీటెండరింగ్ పిలవటంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఎన్నికల కోడ్‌ రావటంతో వంతెనకు సంబంధించిన దస్త్రం మూలనపడింది. నిత్యం ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay

ప్రమాదం అంచున ప్రయాణం : కొట్టుకుపోయిన వంతెన భాగంలో మట్టిపోసిన దారిలో నిత్యం భారీ లోడ్‌ వాహనాలు తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొడవండ్లపల్లి ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అనంతపురం , సత్యసాయి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు తీసుకెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే ప్రమాదకరంగా రాకపోకలు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వంతెన పునర్నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రమాదం అంచున ప్రయాణిస్తున్న తమకు కూటమి ప్రభుత్వం వంతెన పునర్నిర్మాణం పూర్తిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge

People Suffer Due to Damaged Bridge in Anantapur District : గత ఐదేళ్లలో చిన్నపాటి మరమ్మతులు చేయాల్సిన వంతెనల నిర్వహణ గాలికివదిలేయటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల వంతెనలు కూలిపోయాయి. ముదిగుబ్బ మండలంలో 20గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేసే మద్దిలేరువాగువంతెన 2021లో కూలిపోయింది. తాత్కాలిక మరమ్మతుల చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మమ అనిపించింది. గతేడాది చివర్లో వంతెన పునర్నిర్మాణం పేరిట నిధులు విడుదల చేసి గుత్తేదారుకు పనులు అప్పగించినా పూర్తికాలేదు. దీంతో వంతెనపై ప్రమాదకరంగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

దశాబ్దాల పాటు వాడుకుని డంపింగ్ యార్డుగా మార్చేశారు- ఆరేళ్లుగా ప్రజల అవస్థలు - Bayaneru Bridge Damaged

వంతెనల నిర్వాహణ జగన్​ సర్కారు జాప్యం : శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి సమీపంలోని మద్దిలేరువాగు వంతెన ప్రమాదకరంగా మారింది. 20 గ్రామాలను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్న రోడ్డు 2021 నవంబర్‌లో భారీ వరద ప్రవాహానికి కుప్పకూలిపోయింది. ఈ వంతెనకు సంబంధించిన పిల్లర్లు, బీమ్స్ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఒత్తిడి తీసుకురావటంతో కొట్టుకుపోయిన వంతెన భాగంలో మట్టిపోసి తాత్కాలికంగా రాకపోకలు పునరుద్ధరించారు. రెండు సంవత్సరాల పాటు ప్రజలు అధికారులు చుట్టూ తిరగటంతో తప్పని పరిస్థితిలో ప్రభుత్వం వంతెన పునర్నిమాణానికి రూ.2 కోట్ల మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి గుత్తేదారును ఎంపిక చేసి గడువులోపు పనులు పూర్తిచేయలేదంటూ కాంట్రాక్ట్‌ రద్దు చేశారు. రీటెండరింగ్ పిలవటంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఎన్నికల కోడ్‌ రావటంతో వంతెనకు సంబంధించిన దస్త్రం మూలనపడింది. నిత్యం ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay

ప్రమాదం అంచున ప్రయాణం : కొట్టుకుపోయిన వంతెన భాగంలో మట్టిపోసిన దారిలో నిత్యం భారీ లోడ్‌ వాహనాలు తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొడవండ్లపల్లి ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అనంతపురం , సత్యసాయి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు తీసుకెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే ప్రమాదకరంగా రాకపోకలు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వంతెన పునర్నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రమాదం అంచున ప్రయాణిస్తున్న తమకు కూటమి ప్రభుత్వం వంతెన పునర్నిర్మాణం పూర్తిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.