ETV Bharat / state

విజయవాడ బస్టాండ్​లో అగంతకుడు- కమాండోల రాకతో ఖేల్ ఖతం! - Octopus Squad Mock Drill

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 3:04 PM IST

Octopus Squad Mock Drill at Vijayawada Bus Stand: బెజవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రయాణికుడి ముసుగులో అగంతకుడు వచ్చాడన్న సమాచారంతో బస్టాండ్‌ను భారీ సంఖ్యలో బ్లాక్ క్యాట్ కమాండోలు చుట్టుముట్టారు. క్షణాల వ్యవధిలో అక్కడ పరిస్థితి గంభీరంగా మారడంతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి. చివరికి బ్లాక్ కమాండోలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో చుట్టుపక్కలవారు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే?

Octopus_Squad_Mock_Drill_at _Vijayawada_Bus_Stand
Octopus_Squad_Mock_Drill_at _Vijayawada_Bus_Stand (ETV Bharat)

Octopus Squad Mock Drill at Vijayawada Bus Stand: సమయం ఆదివారం రాత్రి 2 గంటలు, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు, ఎటు చూసినా అంధకారం. ఓ సిటీ ఆర్డినరీ బస్సు వేగంగా ప్లాట్ ఫాం పైకి వచ్చి ఆగింది. ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లతో అక్కడికి చేరుకున్న దళాలు చేతిలో తుపాకీలు పట్టుకుని బస్సెక్కాయి.

కొందరు బస్సును చుట్టుముట్టారు. మరికొందరు మెరుపు వేగంతో బస్సులోకి దూసుకెళ్లి ఓ అగంతకుడిని పట్టుకొచ్చారు. నేలపై తోసి వీపుపై తుపాకులు పెట్టి కాల్చబోయారు. నిందితుడు లొంగిపోవడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. క్షణాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి.

పిడుగురాళ్లలో పోలీసుల మాక్​ డ్రిల్​ - ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయిన ప్రజలు - Additional SP Conduct Mock Drill

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్ మొదటి అంతస్తులోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అలజడి రేగింది. ఓ అగంతుకుడు చీకట్లో పరుగులు తీశాడు. రాత్రి వేళ కార్యాలయం లోపలికి దూరి బాంబులు పెట్టారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. క్షణాల్లో పెద్దసంఖ్యలో ఆక్టోపస్ దళాలు మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. నిమిషాల్లోనే నకిలీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రెప్పపాటులో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఆందోళన చెలరేగింది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు నిందితుడు లొంగిపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చివరగా బస్టాండ్​లోని ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆక్టోపస్ దళాలు చేసిన మాక్​డ్రిల్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.

పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోకి ఉగ్రవాదులు జొరబడినట్లిగా భావించిన దళాలు క్షణాల్లో రంగంలోకి దిగి ఉగ్రవాదుల పని పట్టాయి. కాల్పుల్లో, కొందరు గాయపడినట్లుగా సృష్టించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియజేశాయి. మాక్‌డ్రిల్ ప్రారంభంలో భయాందోళనలకు గురైన పలువురు ప్రయాణికులు ఇదంతా ఉత్తుత్తేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఆదివారం రాత్రి సుమారు గంటన్నర పాటు ఆక్టోపస్ దళాలు చేసిన సాహసకృత్యాలు ప్రయాణికులను ఆశ్చర్యపడేలా చేశాయి. మాక్‌డ్రిల్‌లో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 35 మంది ఆక్టోపస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. బెజవాడ బస్టాండ్‌లో భద్రత పటిష్టతపై ఆక్టోపస్ దళాలు స్థానిక పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశాయి. దేశంలో అక్కడక్కడ ఉగ్ర చర్యలు జరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ కోసం భద్రతా పరంగా నిరంతరం ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు.

పోలీసుల మాక్ డ్రిల్‌ - ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా వీక్షించిన ప్రజలు - Police Mock Drill in Dharmavaram

Octopus Squad Mock Drill at Vijayawada Bus Stand: సమయం ఆదివారం రాత్రి 2 గంటలు, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు, ఎటు చూసినా అంధకారం. ఓ సిటీ ఆర్డినరీ బస్సు వేగంగా ప్లాట్ ఫాం పైకి వచ్చి ఆగింది. ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లతో అక్కడికి చేరుకున్న దళాలు చేతిలో తుపాకీలు పట్టుకుని బస్సెక్కాయి.

కొందరు బస్సును చుట్టుముట్టారు. మరికొందరు మెరుపు వేగంతో బస్సులోకి దూసుకెళ్లి ఓ అగంతకుడిని పట్టుకొచ్చారు. నేలపై తోసి వీపుపై తుపాకులు పెట్టి కాల్చబోయారు. నిందితుడు లొంగిపోవడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. క్షణాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి.

పిడుగురాళ్లలో పోలీసుల మాక్​ డ్రిల్​ - ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయిన ప్రజలు - Additional SP Conduct Mock Drill

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్ మొదటి అంతస్తులోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అలజడి రేగింది. ఓ అగంతుకుడు చీకట్లో పరుగులు తీశాడు. రాత్రి వేళ కార్యాలయం లోపలికి దూరి బాంబులు పెట్టారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. క్షణాల్లో పెద్దసంఖ్యలో ఆక్టోపస్ దళాలు మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. నిమిషాల్లోనే నకిలీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రెప్పపాటులో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఆందోళన చెలరేగింది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు నిందితుడు లొంగిపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చివరగా బస్టాండ్​లోని ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆక్టోపస్ దళాలు చేసిన మాక్​డ్రిల్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.

పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోకి ఉగ్రవాదులు జొరబడినట్లిగా భావించిన దళాలు క్షణాల్లో రంగంలోకి దిగి ఉగ్రవాదుల పని పట్టాయి. కాల్పుల్లో, కొందరు గాయపడినట్లుగా సృష్టించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియజేశాయి. మాక్‌డ్రిల్ ప్రారంభంలో భయాందోళనలకు గురైన పలువురు ప్రయాణికులు ఇదంతా ఉత్తుత్తేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఆదివారం రాత్రి సుమారు గంటన్నర పాటు ఆక్టోపస్ దళాలు చేసిన సాహసకృత్యాలు ప్రయాణికులను ఆశ్చర్యపడేలా చేశాయి. మాక్‌డ్రిల్‌లో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 35 మంది ఆక్టోపస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. బెజవాడ బస్టాండ్‌లో భద్రత పటిష్టతపై ఆక్టోపస్ దళాలు స్థానిక పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశాయి. దేశంలో అక్కడక్కడ ఉగ్ర చర్యలు జరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ కోసం భద్రతా పరంగా నిరంతరం ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు.

పోలీసుల మాక్ డ్రిల్‌ - ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా వీక్షించిన ప్రజలు - Police Mock Drill in Dharmavaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.