October Month Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీ చకచకా సాగుతుంది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 2.30 గంటలకు 95.20 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పెన్షన్ అందజేశారు. విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97 శాతం మందికి పైగా పెన్షన్ల అందజేశారు. తిరుపతి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96 శాతానికి పైగా అందించారు. నెల్లూరు, అనకాపల్లి, కడప, బాపట్ల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. 2,721 కోట్లకు గాను ఇప్పటి వరకు 2589 కోట్లను పింఛను రూపంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఏపీలో చకచకా సాగుతున్న పింఛన్ల పంపిణీ - 95.20 శాతం పూర్తి - October Month Pension Distribution
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
October Month Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీ 95.20 శాతం మేర పూర్తయింది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే పింఛన్లు అందించడం ప్రారంభించారు. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పంపిణీ చేశారు.
October Month Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీ చకచకా సాగుతుంది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 2.30 గంటలకు 95.20 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పెన్షన్ అందజేశారు. విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97 శాతం మందికి పైగా పెన్షన్ల అందజేశారు. తిరుపతి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96 శాతానికి పైగా అందించారు. నెల్లూరు, అనకాపల్లి, కడప, బాపట్ల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. 2,721 కోట్లకు గాను ఇప్పటి వరకు 2589 కోట్లను పింఛను రూపంలో లబ్ధిదారులకు అందజేశారు.