ETV Bharat / state

రౌడీలతో అడ్డుకోవాలనుకుంటున్నారు : మంచు మనోజ్​ - HIGH TENSION AT MOHAN BABU VERSITY

మంచు మనోజ్​ను మరోసారి అడ్డుకున్న పోలీసులు - మోహన్​బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదని వెల్లడి - అవసరమైతే ఎస్పీ దగ్గర వెళ్తానన్న మనోజ్​

Manoj Meet Minister Nara Lokesh
Manoj Meet Minister Nara Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2025, 3:30 PM IST

Updated : Jan 15, 2025, 8:56 PM IST

High Tension at Mohan Babu University : మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య తన తాత, నాన్నమ్మ సమాధులకు మంచు మనోజ్‌ నివాళులు అర్పించారు. తన తండ్రిని కలవకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ మనోజ్‌ ఆరోపించారు.

అయితే అంతకుముందు మంచు మనోజ్ యూనివర్శిటీ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో యూనివర్సిటీ బయట పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించారు. భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వవిద్యాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని ఆయనకు చెప్పారు. దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకొని మనోజ్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఆ తర్వాత రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగకు వెళ్లారు.

ఆ తర్వాత మోహన్​బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్ దంపతులు వర్సిటీ వద్దకు రాగా అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. తాత, నాన్నమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల రీత్యా మనోజ్ వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని మరోసారి తెలిపారు. తాత, నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేట్లు తియ్యండంటూ గేటు వద్ద మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు.

Manchu Manoj Issue in Tirupati : అనంతరం సీఐతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మనోజ్‌ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు. బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను, స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్‌ తెలిపారు.

"కోర్టు నోటీసులు నాకు అందలేదు. నేను వస్తున్నానని దిల్లీ సహా వివిధ ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించారు. పోలీసు లాఠీలను రౌడీలు పట్టుకుని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండవద్దని ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. నాకు ప్రవేశం లేదని పోలీసులు నోటీసులు చూపించారు. నాకు నోటీసులు అందలేదు. నేను రాకూడదని నోటీసులున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల మాట మీద గౌరవంతో వెనక్కి వెళ్తున్నా. రౌడీలను చూసి నేను వెనక్కి వెళ్లట్లేదు." - మంచు మనోజ్​, సినీ నటుడు

చట్టం తన పని తాను చేస్తుంది - బహిరంగంగా ఎవ్వరూ స్పందించొద్దు : మంచు విష్ణు

మంచు మోహన్‌బాబు కుటుంబంలో మళ్లీ వివాదం - విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

High Tension at Mohan Babu University : మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య తన తాత, నాన్నమ్మ సమాధులకు మంచు మనోజ్‌ నివాళులు అర్పించారు. తన తండ్రిని కలవకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ మనోజ్‌ ఆరోపించారు.

అయితే అంతకుముందు మంచు మనోజ్ యూనివర్శిటీ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో యూనివర్సిటీ బయట పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించారు. భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వవిద్యాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని ఆయనకు చెప్పారు. దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకొని మనోజ్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఆ తర్వాత రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగకు వెళ్లారు.

ఆ తర్వాత మోహన్​బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్ దంపతులు వర్సిటీ వద్దకు రాగా అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. తాత, నాన్నమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల రీత్యా మనోజ్ వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని మరోసారి తెలిపారు. తాత, నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేట్లు తియ్యండంటూ గేటు వద్ద మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు.

Manchu Manoj Issue in Tirupati : అనంతరం సీఐతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మనోజ్‌ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు. బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను, స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్‌ తెలిపారు.

"కోర్టు నోటీసులు నాకు అందలేదు. నేను వస్తున్నానని దిల్లీ సహా వివిధ ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించారు. పోలీసు లాఠీలను రౌడీలు పట్టుకుని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండవద్దని ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. నాకు ప్రవేశం లేదని పోలీసులు నోటీసులు చూపించారు. నాకు నోటీసులు అందలేదు. నేను రాకూడదని నోటీసులున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల మాట మీద గౌరవంతో వెనక్కి వెళ్తున్నా. రౌడీలను చూసి నేను వెనక్కి వెళ్లట్లేదు." - మంచు మనోజ్​, సినీ నటుడు

చట్టం తన పని తాను చేస్తుంది - బహిరంగంగా ఎవ్వరూ స్పందించొద్దు : మంచు విష్ణు

మంచు మోహన్‌బాబు కుటుంబంలో మళ్లీ వివాదం - విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

Last Updated : Jan 15, 2025, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.