ETV Bharat / state

'అక్షయ పాత్ర' సేవలు అనిర్వచనీయం- అన్నా క్యాంటీన్ల నిర్వహణతో మరింత ప్రతిష్ట : కలిశెట్టి - Kalisetti Appala Naidu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 11:22 AM IST

Kalisetti Appala Naidu met SG Chandra Das: పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర సంస్థకు అప్పజెప్పడం అభినందనీయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. హైదరాబాద్​లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్​ ఆశ్రమంలో అక్షయ పాత్ర సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్ ఎస్​జీ చంద్రదాస్​ను ఆయన కలిసి సన్మానించారు.

MP Kalisetti Appala Naidu
MP Kalisetti Appala Naidu (ETV Bharat)

MP Kalisetti Appala Naidu Met Akshaya Patra Foundation Chairman SG Chandra Das : రాష్ట్రంలో ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత చేపట్టనున్న అక్షయ పాత్ర సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్మన్ ఎస్​జీ చంద్రదాస్​ను హైదరాబాదులోని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్​లో గల ఆశ్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఇదే సందర్భంలో ఎస్​జీ చంద్రదాస్ నుంచి అప్పలనాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర సంస్థకు అప్పజెప్పడం అభినందనీయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

రాష్ట్ర ప్రజలకు గుడ్​న్యూస్​ - అన్న క్యాంటీన్​ ప్రారంభంపై ఉత్తర్వులు జారీ

2014 నుంచి 2019 వరకు అప్పటి నారా చంద్రబాబు నాయుడు సూచనలపై రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. మంచి పేరు తెచ్చుకున్న అక్షయపాత్ర సంస్థ, ఈసారీ కూడా పేదవారికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని కోరారు. మంచి పేరు తెచ్చుకోవాలని అక్షయపాత్ర సంస్థ ఎంపీ అభ్యర్థించారు. యావత్ దేశంలోనే మంచి పేరు ఉన్న పేదవారికి అన్నం పెట్టే బృహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్ల నిర్వహణను చంద్రబాబు నాయుడుఆలోచనలకు తగ్గట్టుగా ఊహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

చివరి అంకానికి అన్న క్యాంటీన్ల ఏర్పాటు- మున్సిపల్ కమిషనర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ - Minister Narayana video conference

గత ప్రభుత్వ హయాంలో నిలిచిన అన్న క్యాంటీన్లు : 2014-19లో టీడీపీ హయాంలో 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అన్న క్యాంటీన్లు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నం క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుతుందని అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫిన్, ఒక పూట భోజనం చేస్తే కనీసం 130 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు - ఆగస్టు 15న తెరుచుకోనున్నాయి - Anna Canteens to be reopened

MP Kalisetti Appala Naidu Met Akshaya Patra Foundation Chairman SG Chandra Das : రాష్ట్రంలో ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత చేపట్టనున్న అక్షయ పాత్ర సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్మన్ ఎస్​జీ చంద్రదాస్​ను హైదరాబాదులోని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్​లో గల ఆశ్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఇదే సందర్భంలో ఎస్​జీ చంద్రదాస్ నుంచి అప్పలనాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర సంస్థకు అప్పజెప్పడం అభినందనీయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

రాష్ట్ర ప్రజలకు గుడ్​న్యూస్​ - అన్న క్యాంటీన్​ ప్రారంభంపై ఉత్తర్వులు జారీ

2014 నుంచి 2019 వరకు అప్పటి నారా చంద్రబాబు నాయుడు సూచనలపై రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. మంచి పేరు తెచ్చుకున్న అక్షయపాత్ర సంస్థ, ఈసారీ కూడా పేదవారికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని కోరారు. మంచి పేరు తెచ్చుకోవాలని అక్షయపాత్ర సంస్థ ఎంపీ అభ్యర్థించారు. యావత్ దేశంలోనే మంచి పేరు ఉన్న పేదవారికి అన్నం పెట్టే బృహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్ల నిర్వహణను చంద్రబాబు నాయుడుఆలోచనలకు తగ్గట్టుగా ఊహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

చివరి అంకానికి అన్న క్యాంటీన్ల ఏర్పాటు- మున్సిపల్ కమిషనర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ - Minister Narayana video conference

గత ప్రభుత్వ హయాంలో నిలిచిన అన్న క్యాంటీన్లు : 2014-19లో టీడీపీ హయాంలో 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అన్న క్యాంటీన్లు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నం క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుతుందని అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫిన్, ఒక పూట భోజనం చేస్తే కనీసం 130 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు - ఆగస్టు 15న తెరుచుకోనున్నాయి - Anna Canteens to be reopened

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.