ETV Bharat / state

'2 లక్షలకు 7.50 లక్షలు వసూలు చేశారు - మరో 4 లక్షలివ్వాలని వేధిస్తున్నారు'

లోకేశ్​ ప్రజాదర్బార్‌కు క్యూకట్టిన బాధితులు - సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

nara_lokesh_praja_darbar
nara_lokesh_praja_darbar (ETV Bharat)

Minister Nara Lokesh Received Requests from People: అధిక వడ్డీ పేరుతో తీవ్ర వేదింపులకు గురి చేస్తున్నారని విజయవాడకు చెందిన ఓ బాధితుడు మంత్రి నారా లోకేశ్​కు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన జక్క వీరస్వామి మంత్రి లోకేశ్​ వద్ద తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఓ మహిళ వద్ద 4 ఏళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకున్నానని కానీ దానికి అసలుగా రూ.7.50 లక్షలు వసూలు చేశారని, ఇంకా మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని వీరస్వామి మంత్రి లోకేశ్​కు వివరించారు.

'2 లక్షలకు 7.50 లక్షలు వసూలు చేశారు - మరో 4 లక్షలివ్వాలని వేధిస్తున్నారు' (ETV Bharat)

భారీగా వచ్చిన బాధితులు: మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో​ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి విజ్ఞప్తులను స్వయంగా తీసుకున్న లోకేశ్​ సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులు, పోలీసులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.

కడియపు లంక నర్సరీలోని ఈ మొక్కపై రతన్​ టాటాకు ఆసక్తి - స్వయంగా కలిసిన రైతులు

అందుకున్న ఫిర్యాదులు:

  • అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సీఎం సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కె. మంగ విజ్ఞప్తి చేశారు.
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లిలోని సుందరయ్య నగర్​కు చెందిన నాగేశ్వరమ్మ కోరారు.
  • గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దానిని తిరిగి పునరుద్దరించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలోని తూర్పు పెద్దివారిపాలెం, పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు లోకేశ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.
  • తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
  • దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విన్నవించారు.

సమస్యలు తీరుస్తామని హామీ: ఫిర్యాదులు అన్నీ స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్​లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?

మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Nara Lokesh Received Requests from People: అధిక వడ్డీ పేరుతో తీవ్ర వేదింపులకు గురి చేస్తున్నారని విజయవాడకు చెందిన ఓ బాధితుడు మంత్రి నారా లోకేశ్​కు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన జక్క వీరస్వామి మంత్రి లోకేశ్​ వద్ద తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఓ మహిళ వద్ద 4 ఏళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకున్నానని కానీ దానికి అసలుగా రూ.7.50 లక్షలు వసూలు చేశారని, ఇంకా మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని వీరస్వామి మంత్రి లోకేశ్​కు వివరించారు.

'2 లక్షలకు 7.50 లక్షలు వసూలు చేశారు - మరో 4 లక్షలివ్వాలని వేధిస్తున్నారు' (ETV Bharat)

భారీగా వచ్చిన బాధితులు: మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో​ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి విజ్ఞప్తులను స్వయంగా తీసుకున్న లోకేశ్​ సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులు, పోలీసులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.

కడియపు లంక నర్సరీలోని ఈ మొక్కపై రతన్​ టాటాకు ఆసక్తి - స్వయంగా కలిసిన రైతులు

అందుకున్న ఫిర్యాదులు:

  • అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సీఎం సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కె. మంగ విజ్ఞప్తి చేశారు.
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లిలోని సుందరయ్య నగర్​కు చెందిన నాగేశ్వరమ్మ కోరారు.
  • గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దానిని తిరిగి పునరుద్దరించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలోని తూర్పు పెద్దివారిపాలెం, పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు లోకేశ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.
  • తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
  • దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విన్నవించారు.

సమస్యలు తీరుస్తామని హామీ: ఫిర్యాదులు అన్నీ స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్​లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?

మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.