ETV Bharat / state

ఇంకెన్నాళ్లీ అవస్థలు - ముంపులోనే లంక గ్రామాలు - Lanka villages still in flood water

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:26 PM IST

Lanka Villages Still in Flood Water at Konaseema District : వర్షం తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పటికి ముంపులోనే మగ్గుతున్నాయి. గ్రామాల్లోని రహదారుల్లో నడుము లోతుల్లో వరద నీరు నిలిచి ప్రజలు, విద్యార్థులు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Lanka Villages Still in Flood Water at Konaseema District
Lanka Villages Still in Flood Water at Konaseema District (ETV Bharat)

Lanka Villages Still in Flood Water at Konaseema District : గోదావరి తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపునకు గురైన గ్రామల ప్రజలకు అధికారులు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 29 వేల ఎకరాలు నీటిపాలయ్యాయి. 2వేల ఎకరాల విస్తీర్ణంలో వరిచేలు నీటమునిగాయి. దాదాపు 6వేల ఎకరాల ఉద్యానపంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods

వరదలో పడవలే దిక్కు : ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు ముంపులోనే మగ్గుతున్నారు. గ్రామాల్లోని రహదారుల్లో నడుము లోతుల్లో వరద నీరు నిలిచిఉంది. ప్రజలు, విద్యార్థులు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తాగునీరు, ఇతర నిత్యావసరాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గౌతమి గోదావరి నది పాయలో వరద ప్రవాహం తగ్గినా అక్కడి ప్రజలకు వరద ముంపు వీడలేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు.

విలవిలలాడుతున్న లంక గ్రామాలు : పి.గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వీరంత పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారెజీ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. సముద్రంలోకి 12.95 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

"గోదావరి వరద పోటుతో కోనసీమలోని లంక గ్రామల రైతులంతా విలవిలలాడుతున్నారు. అరటి, తమలపాకు, బొప్పాయి చెట్లు పూర్తిగా నీటిలోనే నానిపోతున్నాయి. లక్షలరూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాము. వరద పోటు తగ్గినా నీరు భూమిలోకి ఇంకేందుకు సమయం పడుతుంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి." - రైతులు

కొనసాగుతున్న నీటి విడుదల : శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా సాగర్ కు నీళ్లు వదులుతున్నారు. శ్రీశైలంకు జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2.21 లక్షల క్యూసెక్కులను విడిచి పెడుతున్నారు. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.7 అడుగుల నీటిమట్టం ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 202.9 టీఎంసీల నిల్వ ఉంది.

లంక గ్రామాల్లో గోదావరి వరదలు- ఆస్పత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలే - Patient Suffered Due to Floods

పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD

Lanka Villages Still in Flood Water at Konaseema District : గోదావరి తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపునకు గురైన గ్రామల ప్రజలకు అధికారులు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 29 వేల ఎకరాలు నీటిపాలయ్యాయి. 2వేల ఎకరాల విస్తీర్ణంలో వరిచేలు నీటమునిగాయి. దాదాపు 6వేల ఎకరాల ఉద్యానపంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods

వరదలో పడవలే దిక్కు : ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు ముంపులోనే మగ్గుతున్నారు. గ్రామాల్లోని రహదారుల్లో నడుము లోతుల్లో వరద నీరు నిలిచిఉంది. ప్రజలు, విద్యార్థులు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తాగునీరు, ఇతర నిత్యావసరాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గౌతమి గోదావరి నది పాయలో వరద ప్రవాహం తగ్గినా అక్కడి ప్రజలకు వరద ముంపు వీడలేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు.

విలవిలలాడుతున్న లంక గ్రామాలు : పి.గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వీరంత పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారెజీ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. సముద్రంలోకి 12.95 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

"గోదావరి వరద పోటుతో కోనసీమలోని లంక గ్రామల రైతులంతా విలవిలలాడుతున్నారు. అరటి, తమలపాకు, బొప్పాయి చెట్లు పూర్తిగా నీటిలోనే నానిపోతున్నాయి. లక్షలరూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాము. వరద పోటు తగ్గినా నీరు భూమిలోకి ఇంకేందుకు సమయం పడుతుంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి." - రైతులు

కొనసాగుతున్న నీటి విడుదల : శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా సాగర్ కు నీళ్లు వదులుతున్నారు. శ్రీశైలంకు జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2.21 లక్షల క్యూసెక్కులను విడిచి పెడుతున్నారు. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.7 అడుగుల నీటిమట్టం ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 202.9 టీఎంసీల నిల్వ ఉంది.

లంక గ్రామాల్లో గోదావరి వరదలు- ఆస్పత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలే - Patient Suffered Due to Floods

పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.