ETV Bharat / state

పొన్నూరు ఎమ్మార్వో ఆఫీసు​లో కీలక ఫైళ్లు మాయం - ఆందోళనలో ప్రజలు - Files Missing in Ponnuru MRO Office

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 9:13 AM IST

Key Documents Missing in Ponnuru: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వివిధ శాఖలు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోవడం, చెత్తకుప్పలో కనిపించడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న స్థానిక కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయమవ్వడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Key Files Missing in Ponnur MRO Office
Key Files Missing in Ponnur MRO Office (ETV Bharat)

Key Files Missing in Ponnuru MRO Office : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వివిధ శాఖలు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోవడం, చెత్తకుప్పలో కనిపించడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న స్థానిక కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి.

Documents Missing in Ponnuru : గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) పేరుతో నామకరణం చేశారు.

గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office

సీఐడీ అధికారులు విచారణ : కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ అనందరావుకు నోటీసు : ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సీఐడీ విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్‌ పట్టాలు ఇవ్వమని కోరారు.

మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ముమ్మర దర్యాప్తు - మాధవరెడ్డి కోసం పోలీసుల గాలింపు - MADANAPALLE FIRE ACCIDENT CASE

దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్‌ఛార్జి తహసీల్దారు ఐ. ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్‌ అసిస్టెంట్‌ అనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు.

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ - దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసుశాఖ - Madanapalle Fire Accident Case

Key Files Missing in Ponnuru MRO Office : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వివిధ శాఖలు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోవడం, చెత్తకుప్పలో కనిపించడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న స్థానిక కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి.

Documents Missing in Ponnuru : గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) పేరుతో నామకరణం చేశారు.

గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office

సీఐడీ అధికారులు విచారణ : కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ అనందరావుకు నోటీసు : ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సీఐడీ విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్‌ పట్టాలు ఇవ్వమని కోరారు.

మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ముమ్మర దర్యాప్తు - మాధవరెడ్డి కోసం పోలీసుల గాలింపు - MADANAPALLE FIRE ACCIDENT CASE

దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్‌ఛార్జి తహసీల్దారు ఐ. ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్‌ అసిస్టెంట్‌ అనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు.

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ - దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసుశాఖ - Madanapalle Fire Accident Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.