ETV Bharat / state

విశాఖ వేదికగా జగన్ తీరుపై సీపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం- ఇచ్చేది భిక్షకాదు, హక్కంటూ మండిపాటు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:19 PM IST

Employees demand to cancel CPS: సీపీఎస్ రద్దు కోరుతూ విశాఖలో ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామ దీక్ష పేరిట ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో జగన్​కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

Employees demand to cancel CPS
Employees demand to cancel CPS

Employees demand to cancel CPS: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు, సంఘాల నేతలు ఈదీక్ష చేపట్టారు.సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డిమాండ్ తో నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరు ఎండ గడుతూ ఫ్లెక్స్ లను దీక్ష వద్ద ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యయా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు మరోసారి గళమెత్తారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ సీపీఎస్‌ ఉద్యోగులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టారు. నిరసనకు ఉద్యోగులు హాజరుకాకుండా శనివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అడ్డగింపులు చేశారు. శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.


'జీపీఎస్ గురించి అయితే చర్చలకు పిలవొద్దు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు'


సీఎం జగన్ మోసపూరిత హామీలతో దగా చేశారని ఆరోపిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖలో సాగర సంగ్రామ దీక్ష చేపట్టి తమ ఆకాంక్షను బలంగా చాటే ప్రయత్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్, జీపీఎస్‌ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.


Joint Staff Council: సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం: ఏపీ సీఎస్‌


జగన్‌ సీఎం అయ్యాక అన్నీ రివర్స్ విధానంలో సాగుతున్నాయన్న సీపీఎస్‌ ఉద్యోగులు రివర్స్‌ పీఆర్సీ, రివర్స్‌ డీఏలతో పాటు తాజాగా టీచర్‌ ఉద్యోగాల్లో రివర్స్‌ అప్రెంటీస్ విధానాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పింఛన్‌ రాజ్యాగం కల్పించిన హక్కు అని ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

'జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు'

'వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో మా ఓటుతో తగిన బుద్ధి చెబుతాం. ఇకనైనా సీపీఎస్, జీపీఎస్‌ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలి. ఉద్యోగులకు పింఛన్‌ అనేది రాజ్యాగం కల్పించిన హక్కు, ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా పోలీసులు మా ధర్నాను అడ్డుకుంటున్నారు.-' ఉద్యోగ సంఘాల నేతలు

జగన్ ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీ, రివర్స్‌ డీఏ, రివర్స్‌ అప్రెంటీస్!

Employees demand to cancel CPS: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు, సంఘాల నేతలు ఈదీక్ష చేపట్టారు.సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డిమాండ్ తో నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరు ఎండ గడుతూ ఫ్లెక్స్ లను దీక్ష వద్ద ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యయా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు మరోసారి గళమెత్తారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ సీపీఎస్‌ ఉద్యోగులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టారు. నిరసనకు ఉద్యోగులు హాజరుకాకుండా శనివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అడ్డగింపులు చేశారు. శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.


'జీపీఎస్ గురించి అయితే చర్చలకు పిలవొద్దు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు'


సీఎం జగన్ మోసపూరిత హామీలతో దగా చేశారని ఆరోపిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖలో సాగర సంగ్రామ దీక్ష చేపట్టి తమ ఆకాంక్షను బలంగా చాటే ప్రయత్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్, జీపీఎస్‌ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.


Joint Staff Council: సీపీఎస్ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం: ఏపీ సీఎస్‌


జగన్‌ సీఎం అయ్యాక అన్నీ రివర్స్ విధానంలో సాగుతున్నాయన్న సీపీఎస్‌ ఉద్యోగులు రివర్స్‌ పీఆర్సీ, రివర్స్‌ డీఏలతో పాటు తాజాగా టీచర్‌ ఉద్యోగాల్లో రివర్స్‌ అప్రెంటీస్ విధానాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పింఛన్‌ రాజ్యాగం కల్పించిన హక్కు అని ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

'జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు'

'వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో మా ఓటుతో తగిన బుద్ధి చెబుతాం. ఇకనైనా సీపీఎస్, జీపీఎస్‌ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలి. ఉద్యోగులకు పింఛన్‌ అనేది రాజ్యాగం కల్పించిన హక్కు, ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా పోలీసులు మా ధర్నాను అడ్డుకుంటున్నారు.-' ఉద్యోగ సంఘాల నేతలు

జగన్ ప్రభుత్వంలో రివర్స్‌ పీఆర్సీ, రివర్స్‌ డీఏ, రివర్స్‌ అప్రెంటీస్!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.