Police Observers to Andhra Pradesh Elections 2024 : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రానికి ఎన్నికల పోలీసు అబ్జర్వర్లను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వేలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షుడిగా నాగాలాండ్ కేడర్ చెందిన ఐపీఎస్ అధికారి నలీమ్ ముస్తఫాను ఈసీ నియమించింది.
యూపీ కేడర్కు చెందిన సచీంద్ర పటేల్ను శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు అబ్జర్వర్గా యూపీ కేడర్కు చెందిన సచీంద్ర పటేల్ ను నియమించారు. యూపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్కు విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్గా నియమించారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లోని శృంగవరపు కోట, భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గాజువాక, చోజడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావు పేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.
కర్నాటక కేడర్కు చెందిన టిపి శివకుమార్ను కాకినాడ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకుడిగా నియమించారు. గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి బలరామ్ మీనాను రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్గా నియమించారు. ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఈసీ ఆదేశించింది.
ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్లకు, మరో ముగ్గురికీ ప్రభుత్వం పోస్టింగ్ - Postings to IAS Officers in AP
కర్నాటక కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి టి. శ్రీధరాను ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు, ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పర్యవేక్షించాలని ఈసీ సూచించింది. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి ప్రీతిందర్ సింగ్ ను విజయవాడ, గుంటూరు నియోజకవర్గాలకు, ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమిస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇక కర్ణాటకకు చెందిన కెప్టెన్ అయ్యప్పను నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలకు ఆ పరిధిలోకి వచ్చే శాసనసభ నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా నియమించారు.
ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా మహారాష్ట్ర కేడర్కు చెందిన అశోక్ టి. దూబే ను ఈసీ నియమించింది. ఆ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను కూడా దూబే పర్యవేక్షించనున్నారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా బీహార్ కేడర్కు చెందిన హిమాన్షూ శంకర్ త్రివేదిని నియమించారు. అలాగే వీటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలనూ హిమాన్షూ పర్యవేక్షించనున్నారు.
బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త నియామకాలు - జాబితా విడుదల - EC appointed new Collectors and SPs
నాగాలాండ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారిని ఇమ్నాలెన్సా ను అనంతపురం, హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలీసు పర్యవేక్షకురాలిగా నియమించారు. కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలను బీహార్కు కేడర్ ఐపీఎస్ అధికారి దిన్లావాజ్ అహ్మద్ను పోలీసు అబ్జర్వర్గా నియమిస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. ఈ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అహ్మద్ పర్యవేక్షించనున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్గా మహారాష్ట్ర కేడర్కు చెందిన అరవింద్ సాల్వేను నియమించారు. ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా సాల్వే పర్యవేక్షించనున్నారు. ఎన్నికల పోలీసు పర్యవేక్షకులంతా ఏప్రిల్ 25 తేదీ నుంచి 13 మే వరకూ ఏపీలో విధులు నిర్వహించనున్నారు.
వేటు పడిన అధికారుల స్థానంలో ఇంఛార్జులుగా జేసీలు, అదనపు ఎస్పీలు - collectors and SPs panel names