ETV Bharat / state

విశాఖ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు- ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్​నాయుడు - Digiyatra starts at visakha Airport

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:09 AM IST

Digi Travel Services Start at visakhapatnam Airport by Central Minister : పట్టుదలతో భోగాపురం విమానాశ్రయ పనులు ముందుకు నడిపిస్తున్నారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను ప్రారంభించారు.

digi_travel_services_start_at_visakhapatnam_airport
digi_travel_services_start_at_visakhapatnam_airport (ETV Bharat)

Digi Travel Services Start at visakhapatnam Airport by Central Minister Kinjarapu Rammohan Naidu : డిజియాత్ర మొబైల్ యాప్ విమాన ప్రయాణీకులకు సౌకర్యవంతంగానూ, సమయం కలిసి వచ్చేదిగాను ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటివరకు 54 లక్షల మంది యాప్ ద్వారా ప్రయోజనం పొందారని వివరించారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను ప్రారంభించారు. మరో ఎనిమిది ఎయిర్ పోర్టులలో డిజి యాత్ర సదుపాయాన్నివీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 12 ఎయిర్ పోర్టులకే ఈ సదుపాయం ఉందని, ఇప్పుడు అది 21 ఎయిర్ పోర్టులకు విస్తరించిందని వివరించారు.

ఎయిర్ పోర్టు కి వచ్చినపుడు నేరుగా డిజియాత్ర గేట్ ద్వారా వెళ్తే సమయం ఆదా అవుతుందని వివరించారు. పాతపద్దతిలో వెళ్తే నిమిషంన్నర వరకు సమయం పడితే, డిజియాత్ర ద్వారా కేవలం ఐదు సెకెన్లలోనే పని పూర్తవుతుందన్నారు. ఎయిర్ పోర్టులో మీ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు పౌర విమానయాన శాఖ తీసుకుందన్నారు. దేశంలో అన్ని ఎయిర్ పోర్టులలోనూ డిజియాత్ర సదుపాయం విస్తరిస్తామని చెప్పారు. మల్టిపుల్ పాయింట్స్​లో విశాఖలో కొత్త ఎయిర్ పోర్టు రెండేళ్ల లోపుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఏపీలో కొత్త ఎయిర్​పోర్ట్​లకు సర్వే- హెలికాప్టర్ క్రాష్ దర్యాప్తు జరుగుతోంది: రామ్మోహన్ నాయుడు - New Airports in AP

పౌరవిమానయానశాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డిజి యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ సేవలను శుక్రవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ప్రత్యక్షంగాను, పట్నా, రాయ్‌పుర్, భువనేశ్వర్, గోవా, ఇందౌర్, రాంచీ, కొయంబత్తూర్, బాగ్‌డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్‌గాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజి యాత్రను ప్రోత్సహించడానికి తొమ్మిది విమానాశ్రయాలను సమన్వయం చేస్తున్నామన్నారు.

కొవిడ్‌ సమయంలో దీన్ని ప్రారంభించగా లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ యాప్‌లో బోర్డింగ్, ఐడీ ఇతర వివరాలను నమోదు చేసుకుంటే విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీ లేకుండా నేరుగా డిజియాత్ర గేటుద్వారా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సమయాన్ని ఆదాచేసే ఆలోచనతోనే డిజియాత్ర యాప్‌ను ప్రారంభించామన్నారు.

ఏడాదిలోగా విజయవాడ అంతర్జాతీయ టర్మినల్‌ నిర్మాణం పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్​ - Vijayawada airport

Digi Travel Services Start at visakhapatnam Airport by Central Minister Kinjarapu Rammohan Naidu : డిజియాత్ర మొబైల్ యాప్ విమాన ప్రయాణీకులకు సౌకర్యవంతంగానూ, సమయం కలిసి వచ్చేదిగాను ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటివరకు 54 లక్షల మంది యాప్ ద్వారా ప్రయోజనం పొందారని వివరించారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను ప్రారంభించారు. మరో ఎనిమిది ఎయిర్ పోర్టులలో డిజి యాత్ర సదుపాయాన్నివీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 12 ఎయిర్ పోర్టులకే ఈ సదుపాయం ఉందని, ఇప్పుడు అది 21 ఎయిర్ పోర్టులకు విస్తరించిందని వివరించారు.

ఎయిర్ పోర్టు కి వచ్చినపుడు నేరుగా డిజియాత్ర గేట్ ద్వారా వెళ్తే సమయం ఆదా అవుతుందని వివరించారు. పాతపద్దతిలో వెళ్తే నిమిషంన్నర వరకు సమయం పడితే, డిజియాత్ర ద్వారా కేవలం ఐదు సెకెన్లలోనే పని పూర్తవుతుందన్నారు. ఎయిర్ పోర్టులో మీ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు పౌర విమానయాన శాఖ తీసుకుందన్నారు. దేశంలో అన్ని ఎయిర్ పోర్టులలోనూ డిజియాత్ర సదుపాయం విస్తరిస్తామని చెప్పారు. మల్టిపుల్ పాయింట్స్​లో విశాఖలో కొత్త ఎయిర్ పోర్టు రెండేళ్ల లోపుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఏపీలో కొత్త ఎయిర్​పోర్ట్​లకు సర్వే- హెలికాప్టర్ క్రాష్ దర్యాప్తు జరుగుతోంది: రామ్మోహన్ నాయుడు - New Airports in AP

పౌరవిమానయానశాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డిజి యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ సేవలను శుక్రవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ప్రత్యక్షంగాను, పట్నా, రాయ్‌పుర్, భువనేశ్వర్, గోవా, ఇందౌర్, రాంచీ, కొయంబత్తూర్, బాగ్‌డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్‌గాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజి యాత్రను ప్రోత్సహించడానికి తొమ్మిది విమానాశ్రయాలను సమన్వయం చేస్తున్నామన్నారు.

కొవిడ్‌ సమయంలో దీన్ని ప్రారంభించగా లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ యాప్‌లో బోర్డింగ్, ఐడీ ఇతర వివరాలను నమోదు చేసుకుంటే విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీ లేకుండా నేరుగా డిజియాత్ర గేటుద్వారా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సమయాన్ని ఆదాచేసే ఆలోచనతోనే డిజియాత్ర యాప్‌ను ప్రారంభించామన్నారు.

ఏడాదిలోగా విజయవాడ అంతర్జాతీయ టర్మినల్‌ నిర్మాణం పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్​ - Vijayawada airport

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.