ETV Bharat / state

సీఆర్డీఏ సమావేశంలో గందరగోళం - సమాచారం ఇవ్వలేదన్న రైతులు - అధికారులతో వాగ్వాదం - Capital farmers meet crda

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 12:33 PM IST

Capital Farmers Meet CRDA: కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రైతులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. భిన్నాభిప్రాయలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నారు.

Capital Farmers Meet CRDA
Capital Farmers Meet CRDA (ETV Bharat)

Capital Farmers Meet CRDA: అమరావతి పనులు జోరందుకున్నాయి. రాజధాని అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని తీసుకునేందుకు రైతులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం అయ్యారు. అయితే తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన సీఆర్డీఏ సమావేశంలో గందరగోళం నెలకొంది. చాలామందికి సమాచారం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. భూముల సర్వేపై రెండుగా విడిపోయి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిహార విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. కొంతమంది రైతులు గజానికి 50 వేలు అడుగుతుండగా, మరి కొంతమంది అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

పరిహారం కోరుతున్న రైతులు గత ఐదేళ్లుగా కాలయాపన చేసి, అభివృద్ధి జరుగుతున్న సమయంలో అడ్డుతగలడం మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. మళ్లీ పూర్తి స్థాయిలో సర్వే చేయాలని బయటకు వచ్చేశారు. దీంతో సమాచారమిచ్చి సమావేశం నిర్వహిస్తామని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. రహదారి విస్తరణకు సహకరిస్తే భూసమీకరణలో తీసుకుంటామని, లేకపోతే భూసేకరణ కింద పరిహారం ఇచ్చి భూములు తీసుకునేందుకు సిద్ధమని సీఆర్​డీఏ అధికారులు చెప్పారు.

మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పునర్నిర్మాణం - భూసేకరణపై పెనుమాక రైతులతో చర్చలు - CRDA Officers met Penumaka farmers

వరుస సమావేశాలు: ఇప్పటికే సీఆర్​డీఏ అధికారులు రైతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లిలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సర్వేను పూర్తి చేసిన సీఆర్డీఏ గురువారం భూయజమానులతో సమావేశమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తమ భూమి ఇచ్చేందుకు పెనుమాక రైతులు సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో తమకు ఇచ్చే ప్యాకేజీని పొడిగించాలని వారు డిమాండ్ చేశారు.

భూసమీకరణలో భాగంగా ఇప్పటి వరకు ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 1450 గజాల స్థలాన్ని పరిహారం కింద ఇచ్చేవాళ్లు. అయితే పెనుమాక రైతులు తమకు రెండు వేల గజాల స్థలం ఇవ్వాలని కోరారు. పాత పద్ధతిలోనే పరిహారం ఇస్తామని సీఆర్డీఏ అధికారులు రైతులకు తెలిపారు. ఇదే అంశంపై సీఆర్​డీఏ కమిషనర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. అదే విధంగా శుక్రవారం పెనుమాక, ఉండవల్లి రైతులతో మరోసారి సీఆర్​డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమావేశం అయ్యారు. ఇలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరమైన భూసమీకరణను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అమరావతికి పూర్వవైభవం - పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి - CONSULATES MEET CRDA COMMISSIONER

Capital Farmers Meet CRDA: అమరావతి పనులు జోరందుకున్నాయి. రాజధాని అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని తీసుకునేందుకు రైతులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం అయ్యారు. అయితే తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన సీఆర్డీఏ సమావేశంలో గందరగోళం నెలకొంది. చాలామందికి సమాచారం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. భూముల సర్వేపై రెండుగా విడిపోయి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిహార విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. కొంతమంది రైతులు గజానికి 50 వేలు అడుగుతుండగా, మరి కొంతమంది అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

పరిహారం కోరుతున్న రైతులు గత ఐదేళ్లుగా కాలయాపన చేసి, అభివృద్ధి జరుగుతున్న సమయంలో అడ్డుతగలడం మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. మళ్లీ పూర్తి స్థాయిలో సర్వే చేయాలని బయటకు వచ్చేశారు. దీంతో సమాచారమిచ్చి సమావేశం నిర్వహిస్తామని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. రహదారి విస్తరణకు సహకరిస్తే భూసమీకరణలో తీసుకుంటామని, లేకపోతే భూసేకరణ కింద పరిహారం ఇచ్చి భూములు తీసుకునేందుకు సిద్ధమని సీఆర్​డీఏ అధికారులు చెప్పారు.

మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పునర్నిర్మాణం - భూసేకరణపై పెనుమాక రైతులతో చర్చలు - CRDA Officers met Penumaka farmers

వరుస సమావేశాలు: ఇప్పటికే సీఆర్​డీఏ అధికారులు రైతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లిలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సర్వేను పూర్తి చేసిన సీఆర్డీఏ గురువారం భూయజమానులతో సమావేశమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తమ భూమి ఇచ్చేందుకు పెనుమాక రైతులు సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో తమకు ఇచ్చే ప్యాకేజీని పొడిగించాలని వారు డిమాండ్ చేశారు.

భూసమీకరణలో భాగంగా ఇప్పటి వరకు ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 1450 గజాల స్థలాన్ని పరిహారం కింద ఇచ్చేవాళ్లు. అయితే పెనుమాక రైతులు తమకు రెండు వేల గజాల స్థలం ఇవ్వాలని కోరారు. పాత పద్ధతిలోనే పరిహారం ఇస్తామని సీఆర్డీఏ అధికారులు రైతులకు తెలిపారు. ఇదే అంశంపై సీఆర్​డీఏ కమిషనర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. అదే విధంగా శుక్రవారం పెనుమాక, ఉండవల్లి రైతులతో మరోసారి సీఆర్​డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమావేశం అయ్యారు. ఇలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరమైన భూసమీకరణను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అమరావతికి పూర్వవైభవం - పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి - CONSULATES MEET CRDA COMMISSIONER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.