ETV Bharat / state

లోయలో పడిన ఆర్టీసీ బస్సు - 20 మందికి గాయాలు

పులివెందుల సమీపంలో అదుపు తప్పిన బస్సు

Bus Accident in Pulivendula
Bus Accident in Pulivendula (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 9:02 AM IST

Updated : Oct 23, 2024, 2:27 PM IST

Pulivendula Bus Accident Today : వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కదిరి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్‌యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్‌ సడెన్​గా బ్రేకులు వేశారు. దీంతో బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ క్రమంలోనే చెట్లను తాకుతూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు - స్పాట్​లోనే నలుగురు మృతి

Pulivendula Bus Accident Today : వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కదిరి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్‌యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్‌ సడెన్​గా బ్రేకులు వేశారు. దీంతో బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ క్రమంలోనే చెట్లను తాకుతూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు - స్పాట్​లోనే నలుగురు మృతి

Last Updated : Oct 23, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.