ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

AP Sadhu Parishad Srinivasananda Saraswati: మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ ఐదేళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్‌కు ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు.

AP Sadhu Parishad Srinivasananda Saraswati
AP Sadhu Parishad Srinivasananda Saraswati (ETV Bharat)

AP Sadhu Parishad Srinivasananda Saraswati : మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో హిందూ ధార్మిక సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఏపీ సాధుపరిషత్ శ్రీనివాసానంద సరస్వతి, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా? అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని అన్నారు.

జగన్​కు అభ్యంతరం ఏంటి? : గత ఐదేళ్లలో ఏనాడైనా డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేశారా? తిరుమలకు ఏ రోజైనా కుటుంబంతో కలిసి జగన్‌ వచ్చారా? తిరుమల సంప్రదాయాలను జగన్‌ ఎందుకు పాటించట్లేదని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎందుకు అభ్యంతరమని నిలదీశారు. జగన్ గత ఐదేళ్లలో హిందూ మనోభావాలు, విశ్వాసాలను జగన్‌ ఏనాడూ గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా జగన్‌ ఏనాడూ స్పందించలేదని గుర్తు చేశారు. హిందువులపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, హిందువులపై భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని, హిందువుల పక్షాన మాట్లాడేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు ముందుకురావాలని సూచించారు.

జగన్‌ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్‌ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour

జగన్ పర్యటనతో తిరుమల అపవిత్రం : గత ఐదేళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని శ్రీనివాసానంద ఆరోపించారు. తన కుటుంబసభ్యులను పాలకమండలిలో నియమించుకుని అక్రమాలు చేశారని తెలిపారు. తిరుమలను శాంతియాగం, ప్రోక్షణతో పవిత్రం చేశారని, జగన్ పర్యటనతో మళ్లీ అపవిత్రమవుతుందని అన్నారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవు పలికారు.

శాంతి భద్రతలకు విఘాతం : మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని శ్రీనివాసానంద ఆరోపించారు. ఈ పర్యటనలో కోడికత్తి నాటకాలాడతారని అనుమానాలున్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తారని అనుమానం కలుగుతోందని అన్నారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రం ప్రాశస్త్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాపాడింది లేదని ఆరోపించారు. గత ఐదేళ్లు ఎన్నో పాపాలు జరిగాయని, ప్రక్షాళన జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హిందూత్వానికి కష్టమొచ్చిందని, అందరూ ఒక్కటై కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration

జగన్​పై వ్యక్తిగత ద్వేషం లేదు : సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని, బోర్డు ఏర్పాటుకు రాజకీయ పక్షాలన్నీ సహకరించాలని శ్రీనివాసానంద డిమాండ్ చేశారు. అపచారం జరిగినపుడు హిందూధర్మాన్ని విశ్వసించేవారు స్పందించాలని అన్నారు. హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే బోర్డు సభ్యులు వెళ్లొచ్చని హిందువుల కష్టాలు తెలుసుకుని న్యాయం చేసేందుకు ట్రస్టు కృషి చేస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. ఆలయాల సంప్రదాయాలను గౌరవించకపోవడాన్ని తప్పుపడుతున్నామని అన్నారు.

జనసేన నేతలు అడ్డుకోవట్లేదు : మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన నేత కిరణ్‌రాయల్‌ విమర్శించారు. జగన్ హయాంలో పవన్, చంద్రబాబు పర్యటనలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. జగన్ తిరుమల పర్యటనను జనసేన నేతలు అడ్డుకోవట్లేదని తెలిపారు.

పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారు - వారిని కఠినంగా శిక్షించాలి: శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati fire jagan

AP Sadhu Parishad Srinivasananda Saraswati : మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో హిందూ ధార్మిక సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఏపీ సాధుపరిషత్ శ్రీనివాసానంద సరస్వతి, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా? అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని అన్నారు.

జగన్​కు అభ్యంతరం ఏంటి? : గత ఐదేళ్లలో ఏనాడైనా డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేశారా? తిరుమలకు ఏ రోజైనా కుటుంబంతో కలిసి జగన్‌ వచ్చారా? తిరుమల సంప్రదాయాలను జగన్‌ ఎందుకు పాటించట్లేదని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎందుకు అభ్యంతరమని నిలదీశారు. జగన్ గత ఐదేళ్లలో హిందూ మనోభావాలు, విశ్వాసాలను జగన్‌ ఏనాడూ గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా జగన్‌ ఏనాడూ స్పందించలేదని గుర్తు చేశారు. హిందువులపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, హిందువులపై భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని, హిందువుల పక్షాన మాట్లాడేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు ముందుకురావాలని సూచించారు.

జగన్‌ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్‌ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour

జగన్ పర్యటనతో తిరుమల అపవిత్రం : గత ఐదేళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని శ్రీనివాసానంద ఆరోపించారు. తన కుటుంబసభ్యులను పాలకమండలిలో నియమించుకుని అక్రమాలు చేశారని తెలిపారు. తిరుమలను శాంతియాగం, ప్రోక్షణతో పవిత్రం చేశారని, జగన్ పర్యటనతో మళ్లీ అపవిత్రమవుతుందని అన్నారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవు పలికారు.

శాంతి భద్రతలకు విఘాతం : మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని శ్రీనివాసానంద ఆరోపించారు. ఈ పర్యటనలో కోడికత్తి నాటకాలాడతారని అనుమానాలున్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తారని అనుమానం కలుగుతోందని అన్నారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రం ప్రాశస్త్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాపాడింది లేదని ఆరోపించారు. గత ఐదేళ్లు ఎన్నో పాపాలు జరిగాయని, ప్రక్షాళన జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హిందూత్వానికి కష్టమొచ్చిందని, అందరూ ఒక్కటై కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration

జగన్​పై వ్యక్తిగత ద్వేషం లేదు : సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని, బోర్డు ఏర్పాటుకు రాజకీయ పక్షాలన్నీ సహకరించాలని శ్రీనివాసానంద డిమాండ్ చేశారు. అపచారం జరిగినపుడు హిందూధర్మాన్ని విశ్వసించేవారు స్పందించాలని అన్నారు. హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే బోర్డు సభ్యులు వెళ్లొచ్చని హిందువుల కష్టాలు తెలుసుకుని న్యాయం చేసేందుకు ట్రస్టు కృషి చేస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. ఆలయాల సంప్రదాయాలను గౌరవించకపోవడాన్ని తప్పుపడుతున్నామని అన్నారు.

జనసేన నేతలు అడ్డుకోవట్లేదు : మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన నేత కిరణ్‌రాయల్‌ విమర్శించారు. జగన్ హయాంలో పవన్, చంద్రబాబు పర్యటనలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. జగన్ తిరుమల పర్యటనను జనసేన నేతలు అడ్డుకోవట్లేదని తెలిపారు.

పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారు - వారిని కఠినంగా శిక్షించాలి: శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati fire jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.