ETV Bharat / state

ఏపీకి 6,880 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మధ్యంతర నివేదిక - AP Floods Damage Report

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 7:25 AM IST

AP Floods Damage Report : వరద విపత్తు వల్ల ఏపీకి రూ.6880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 7 జిల్లాల్లో సుమారు 11 లక్షల మంది ముంపు బారినపడినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన సర్కార్ మరో ఇద్దరు గల్లంతైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 4222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

AP Floods Damage Report
AP Floods Damage Report (ETV Bharat)

Report on AP Floods Loss 2024 : రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2న 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది.

ప్రకాశం బ్యారేజీ కట్టాక - పెద్ద వరద : ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాలతోపాటు దిగువన ఉన్న కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు నీటమునిగాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీని పునఃపరిశీలించడంతోపాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రెయిన్‌తోపాటు డైవర్షన్‌ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని కోరింది.

5 లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం : భారీ వర్షాలు, వరదల కారణంగా 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయని ప్రభుత్వం వివరించింది. దీనికి పెట్టుబడి రాయితీగా రూ.341.30 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించింది. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మృతిచెందాయని పేర్కొంది. 226 పడవలు పాక్షికంగా మరో 217 పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది.

ఆర్అండ్​బీ రహదారులు 3900 కిలోమీటర్ల మేర, 353 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం నివేదించింది. 79 చోట్ల రహదారులకు గండ్లు పడగా 238 చోట్ల రోడ్లపైకెక్కి నీరు పారినట్లు తెలిపింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని వివరించింది. పురపాలకశాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీటమునిగాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 6382 వీధి దీపాలు దెబ్బతినగా, 195 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం చెప్పింది.

AP Report to Center on Flood Damage : ఎన్టీఆర్ జిల్లాల్లో 2.32 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 7.04 లక్షల మంది వరదల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం పేర్కొంది. విజయవాడలోని 32 వార్డులతోపాటు. 5 గ్రామాల ప్రజలు ముంపు బారినపడ్డారని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు నీటమునిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

కోస్తాంధ్ర జిల్లాల్లో దంచికొట్టిన వానలు - అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరికలు - Rains in Coastal Andhra Districts

విజయనగరం జిల్లాలో రెడ్ అలర్ట్- కలెక్టర్ కీలక ఆదేశాలు - FLOOD IN VIZIANAGARAM DISTRICT

Report on AP Floods Loss 2024 : రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2న 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది.

ప్రకాశం బ్యారేజీ కట్టాక - పెద్ద వరద : ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాలతోపాటు దిగువన ఉన్న కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు నీటమునిగాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీని పునఃపరిశీలించడంతోపాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రెయిన్‌తోపాటు డైవర్షన్‌ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని కోరింది.

5 లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం : భారీ వర్షాలు, వరదల కారణంగా 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయని ప్రభుత్వం వివరించింది. దీనికి పెట్టుబడి రాయితీగా రూ.341.30 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించింది. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మృతిచెందాయని పేర్కొంది. 226 పడవలు పాక్షికంగా మరో 217 పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది.

ఆర్అండ్​బీ రహదారులు 3900 కిలోమీటర్ల మేర, 353 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం నివేదించింది. 79 చోట్ల రహదారులకు గండ్లు పడగా 238 చోట్ల రోడ్లపైకెక్కి నీరు పారినట్లు తెలిపింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని వివరించింది. పురపాలకశాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీటమునిగాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 6382 వీధి దీపాలు దెబ్బతినగా, 195 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం చెప్పింది.

AP Report to Center on Flood Damage : ఎన్టీఆర్ జిల్లాల్లో 2.32 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 7.04 లక్షల మంది వరదల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం పేర్కొంది. విజయవాడలోని 32 వార్డులతోపాటు. 5 గ్రామాల ప్రజలు ముంపు బారినపడ్డారని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు నీటమునిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

కోస్తాంధ్ర జిల్లాల్లో దంచికొట్టిన వానలు - అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరికలు - Rains in Coastal Andhra Districts

విజయనగరం జిల్లాలో రెడ్ అలర్ట్- కలెక్టర్ కీలక ఆదేశాలు - FLOOD IN VIZIANAGARAM DISTRICT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.