ETV Bharat / state

సర్వే నెంబర్‌ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు : జోగి రాజీవ్ అరెస్టుపై ఏసీబీ ఏఎస్పీ - ACB ASP on Jogi Rajeev Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 5:22 PM IST

ACB Additional SP on Jogi Rajeev Arrest: అగ్రిగోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని నిర్ధారించాకే జోగి రాజీవ్‌, సర్వేయర్ రమేశ్‌ను అరెస్టు చేశామన్నారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్‌ను మార్చేశారని తెలిపారు. మాజీమంత్రి జోగి రమేశ్ పాత్ర నిర్ధారణైతే ఆయనపైనా కేసు నమోదు చేస్తామని సౌమ్యలత స్పష్టం చేశారు.

ACB Additional SP on Jogi Rajeev Arrest
ACB Additional SP on Jogi Rajeev Arrest (ETV Bharat)

ACB Additional SP on Jogi Rajeev Arrest: అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్​ను అరెస్టు చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్​మెంట్​లో ఉన్నాయని, ఆ భూముల సర్వే నెంబర్​ను మార్చారన్నారు. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.

పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని చెప్పారు. అందుకే తమ విచారణ వేరుగా సాగిస్తున్నట్లు తెలిపారు. సీఐడీ, ఎసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. తమ దర్యాప్తులో ఐదుగురు పేర్లు ఉన్నాయని, విచారణలో మరికొన్ని పేర్లు రావొచ్చన్నారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుందని, ఆయన ప్రమేయంపై నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

87 సర్వే నెంబర్​లో ఎలాంటి సబ్ డివిజన్​లు జరగలేదన్నారు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అక్రమ రిజిస్ట్రేషన్​లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని చెప్పారు. సర్వే నెంబర్‌ 88లో స్థలం కొని 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగిందని వెల్లడించారు. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారన్నారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్​లను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

JOGI RAMESH SON RAJEEV ARREST: కాగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐడీ అటాచ్​మెంట్​లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

తనిఖీల అనంతరం జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావులపై ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావు పేర్లను సైతం చేర్చారు. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్లు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

ACB Additional SP on Jogi Rajeev Arrest: అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్​ను అరెస్టు చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్​మెంట్​లో ఉన్నాయని, ఆ భూముల సర్వే నెంబర్​ను మార్చారన్నారు. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.

పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని చెప్పారు. అందుకే తమ విచారణ వేరుగా సాగిస్తున్నట్లు తెలిపారు. సీఐడీ, ఎసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. తమ దర్యాప్తులో ఐదుగురు పేర్లు ఉన్నాయని, విచారణలో మరికొన్ని పేర్లు రావొచ్చన్నారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుందని, ఆయన ప్రమేయంపై నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

87 సర్వే నెంబర్​లో ఎలాంటి సబ్ డివిజన్​లు జరగలేదన్నారు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అక్రమ రిజిస్ట్రేషన్​లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని చెప్పారు. సర్వే నెంబర్‌ 88లో స్థలం కొని 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగిందని వెల్లడించారు. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారన్నారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్​లను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

JOGI RAMESH SON RAJEEV ARREST: కాగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐడీ అటాచ్​మెంట్​లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

తనిఖీల అనంతరం జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావులపై ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావు పేర్లను సైతం చేర్చారు. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్లు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.