ETV Bharat / state

నంద్యాల జిల్లాలో దారుణం - మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత - women died leopard attacked

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 8:14 PM IST

Updated : Jun 25, 2024, 10:34 PM IST

Leopard Attacked and Killed Women in Nandyal District : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి తలభాగాన్ని వేరుచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మహిళ కేకలు విన్న గ్రామస్థులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి చూడగా మృతురాలి మొండెం మాత్రమే కనిపించడంతో తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

Leopard Attacked and Killed Women in Nandyal District
Leopard Attacked and Killed Women in Nandyal District (ETV Bharat)

A Leopard Attacked and Killed Women in Nandyal District : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి తలభాగాన్ని వేరుచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని శిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామ సమీపాన ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో కట్టెల కోసం మెుహరున్నిషా(45) అనే మహిళ వెళ్లింది. అదే సమయంలో ఒక్క సారిగా వచ్చిన చిరుత మెుహరున్నిషాపై దాడి చేసింది. ఆ సమయంలో చిరుత నోటికి చిక్కిన మహిళ కేకలు చేసింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే మహిళ తలభాగాన్ని వేరుచేసి చంపేసింది. అడవిలోకి వెళ్లిన గ్రామస్తులకు మృతురాలి మొండెం మాత్రమే కనిపించింది. దీంతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురైయ్యారు.

నెల్లూరులో విజృంభిస్తున్న డయేరియా- పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరిక

గత పదిరోజులుగా చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తుందిని స్థానికులు తెలిపారు. గతంలో రైల్వే పనులు చేస్తున్న ఓ మహిళపై దాడిచేసి గాయపరిచింది. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన షేక్ బేబీ అనే మహిళ తన ఇంటి వద్దనే నిద్రిస్తుండగా చిరుత దాడి చేయడంతో స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో అటవీ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే మహిళ ప్రాణాలను చిరుత బలితీసుకుంది. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

'మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా'- నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు

A Leopard Attacked and Killed Women in Nandyal District : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి తలభాగాన్ని వేరుచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని శిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామ సమీపాన ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో కట్టెల కోసం మెుహరున్నిషా(45) అనే మహిళ వెళ్లింది. అదే సమయంలో ఒక్క సారిగా వచ్చిన చిరుత మెుహరున్నిషాపై దాడి చేసింది. ఆ సమయంలో చిరుత నోటికి చిక్కిన మహిళ కేకలు చేసింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే మహిళ తలభాగాన్ని వేరుచేసి చంపేసింది. అడవిలోకి వెళ్లిన గ్రామస్తులకు మృతురాలి మొండెం మాత్రమే కనిపించింది. దీంతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురైయ్యారు.

నెల్లూరులో విజృంభిస్తున్న డయేరియా- పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరిక

గత పదిరోజులుగా చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తుందిని స్థానికులు తెలిపారు. గతంలో రైల్వే పనులు చేస్తున్న ఓ మహిళపై దాడిచేసి గాయపరిచింది. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన షేక్ బేబీ అనే మహిళ తన ఇంటి వద్దనే నిద్రిస్తుండగా చిరుత దాడి చేయడంతో స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో అటవీ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే మహిళ ప్రాణాలను చిరుత బలితీసుకుంది. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

'మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా'- నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు

Last Updated : Jun 25, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.