ETV Bharat / politics

అత్యధిక నామినేషన్లు ఇక్కడే! గుంటూరు పార్లమెంటరీకి 47- తిరుపతి అసెంబ్లీకి 52 నామినేషన్లు - nominations scrutiny process

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 9:57 PM IST

nominations scrutiny process over: సార్వత్రిక ఎన్నికల్లో నిన్న పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు.

nominations scrutiny process over
nominations scrutiny process over

nominations scrutiny process over: ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 తేదీ ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25 తేదీ వరకూ కొనసాగింది. వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికల్లో నిన్న పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

అత్యధికంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 47 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 నామినేషన్లు దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 29 తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.


LIVE: విశాఖ రైల్వే జోన్​ - బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై కూటమి నేతల మీడియా సమావేశం - NDA Leaders media conference

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియ 26 తేదీన ముగించాల్సి ఉండగా, భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో నేడు సైతం, పరిశీలన ప్రక్రియ కొనసాగింది. ఈ నెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కోన్నారు. లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి 200 మంది రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో మెుత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 13 తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ 4 తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

మాఫియాలకు లబ్దే జగన్ ప్రభుత్వం లక్ష్యం - రైల్వే జోన్ స్థలం కేటాయింపులో అలసత్వం: కేంద్రమంత్రి పీయూష్‌ - Union Minister Piyush Goyal Fires

nominations scrutiny process over: ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 తేదీ ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25 తేదీ వరకూ కొనసాగింది. వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికల్లో నిన్న పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

అత్యధికంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 47 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 నామినేషన్లు దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 29 తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.


LIVE: విశాఖ రైల్వే జోన్​ - బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై కూటమి నేతల మీడియా సమావేశం - NDA Leaders media conference

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియ 26 తేదీన ముగించాల్సి ఉండగా, భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో నేడు సైతం, పరిశీలన ప్రక్రియ కొనసాగింది. ఈ నెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కోన్నారు. లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి 200 మంది రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో మెుత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 13 తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ 4 తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

మాఫియాలకు లబ్దే జగన్ ప్రభుత్వం లక్ష్యం - రైల్వే జోన్ స్థలం కేటాయింపులో అలసత్వం: కేంద్రమంత్రి పీయూష్‌ - Union Minister Piyush Goyal Fires

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.