ETV Bharat / politics

జనం జడుసుకోవడాలు - వ్యాపారుల బెంబేలు, చెట్ల వణుకులు ఇక ఉండవులే! - YS Jagan Visit Pulivendula

YS Jagan Pulivendula Tour : ఆయన పర్యటన అంటే మాత్రం ప్రజలు బెంబేలెత్తిపోతారు. వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. దీంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు. ఇవన్నీ గతం కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా ఆయన పులివెందుల పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. అంతేకాదు కాన్వాయ్​ దిగి మరీ ప్రజలతో మాట్లాడి సెల్ఫీలు దిగారు. అధికారం మార్పుతో ఎంత మార్పు జరిగిందోనని పలువురు అనుకుంటున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 12:28 PM IST

Updated : Jul 8, 2024, 2:10 PM IST

YS Jagan Visit Pulivendula
YS Jagan Visit Pulivendula (ETV Bharat)

YS Jagan Visit Pulivendula : ఆయన పర్యటన ఉందంటే చాలు రోడ్లపై పరదాలు దర్శనమిస్తాయి. ఓ వైపు చెట్లు జడుసుకుంటాయి. అడ్డంగా ఉన్నామని తమను నరుకుతారోనన్న భయంతో. మరోవైపు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారోనని జనం జడుసుకుంటారు. వ్యాపారులు బెంబేలెత్తిపోతారు, ఆ రోజంతా దుకాణాలు మూసి వేయాలని పోలీసులు బెదిరింపులకు గుర్తి చేస్తారు. ముందస్తుగానే ఆ ప్రాంతంలోని ప్రతిపక్ష నేతలను గృహ నిర్భధం చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై తిరిగి కేసులు పెడతారు.

People on YS Jagan Pulivendula Tour : మరోవైపు ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్లు తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్‌ స్టేషన్‌లో పడిగాపులు పడాల్సిందే. ఎందుకంటే వాటన్నింటిని ఆయన పర్యటనకే తరలిస్తారు! దీనికితోడూ పర్యటనలో వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. అదేెంటో విచిత్రం గాల్లో ఆయన ప్రయాణించినా అవే రూల్స్ విధిస్తారు. వారు వస్తుంటే, ఒక్కరోజు సహకరించలేరా అంటూ పోలీసులు, ఆ పార్టీ నేతలు జనంపై రుసరుసలాడుతారు.

ప్రజలు నెత్తీనోరు బాదుకున్నా ఆ మార్గంలో అనుమతించరు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయన పర్యటనల పేరిట జనాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఎవరేమనుకుంటే మాకెంటి అని దులిపేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది ఆయనేనండి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.

ఏపీ వ్యాప్తంగానే కాకుండా జగన్​మోహన్​ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇదే పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ పరదాలు కట్టుకుని తిరిగి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. తాజాగా మూడు రోజుల జిల్లా పర్యటనకు ఆయన పులివెందులకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో జనం జడుసుకోవడం గానీ వ్యాపారులు బెంబేలెత్తడం గానీ చెట్లు వణికిన దాఖలాలు, పోలీసుల ఆంక్షలు కన్పించలేదు.

ముక్కున వేలేసుకున్న స్థానికులు : ఆదివారం నాడు పులివెందుల నుంచి లింగాల మండలానికి బయలుదేరి వెళ్లిన జగన్​మోహన్ రెడ్డి దారి వెంబడి కాన్వాయ్‌ ఆపి స్థానికులు, కార్యకర్తలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. పులివెందులలోనూ ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇంతలో ఎంత మార్పు అని అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు.

"అన్నొస్తే.. అవస్థలే".. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా.. ప్రజల అసహనం

People Facing Problems with CM Tour: "ఆ చెట్లు నరికేయ్​.. ఈ డివైడర్​ తీసేయ్​.. సీఎం సారొస్తున్నారు"

YS Jagan Visit Pulivendula : ఆయన పర్యటన ఉందంటే చాలు రోడ్లపై పరదాలు దర్శనమిస్తాయి. ఓ వైపు చెట్లు జడుసుకుంటాయి. అడ్డంగా ఉన్నామని తమను నరుకుతారోనన్న భయంతో. మరోవైపు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారోనని జనం జడుసుకుంటారు. వ్యాపారులు బెంబేలెత్తిపోతారు, ఆ రోజంతా దుకాణాలు మూసి వేయాలని పోలీసులు బెదిరింపులకు గుర్తి చేస్తారు. ముందస్తుగానే ఆ ప్రాంతంలోని ప్రతిపక్ష నేతలను గృహ నిర్భధం చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై తిరిగి కేసులు పెడతారు.

People on YS Jagan Pulivendula Tour : మరోవైపు ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్లు తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్‌ స్టేషన్‌లో పడిగాపులు పడాల్సిందే. ఎందుకంటే వాటన్నింటిని ఆయన పర్యటనకే తరలిస్తారు! దీనికితోడూ పర్యటనలో వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. అదేెంటో విచిత్రం గాల్లో ఆయన ప్రయాణించినా అవే రూల్స్ విధిస్తారు. వారు వస్తుంటే, ఒక్కరోజు సహకరించలేరా అంటూ పోలీసులు, ఆ పార్టీ నేతలు జనంపై రుసరుసలాడుతారు.

ప్రజలు నెత్తీనోరు బాదుకున్నా ఆ మార్గంలో అనుమతించరు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయన పర్యటనల పేరిట జనాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఎవరేమనుకుంటే మాకెంటి అని దులిపేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది ఆయనేనండి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.

ఏపీ వ్యాప్తంగానే కాకుండా జగన్​మోహన్​ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇదే పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ పరదాలు కట్టుకుని తిరిగి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. తాజాగా మూడు రోజుల జిల్లా పర్యటనకు ఆయన పులివెందులకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో జనం జడుసుకోవడం గానీ వ్యాపారులు బెంబేలెత్తడం గానీ చెట్లు వణికిన దాఖలాలు, పోలీసుల ఆంక్షలు కన్పించలేదు.

ముక్కున వేలేసుకున్న స్థానికులు : ఆదివారం నాడు పులివెందుల నుంచి లింగాల మండలానికి బయలుదేరి వెళ్లిన జగన్​మోహన్ రెడ్డి దారి వెంబడి కాన్వాయ్‌ ఆపి స్థానికులు, కార్యకర్తలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. పులివెందులలోనూ ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇంతలో ఎంత మార్పు అని అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు.

"అన్నొస్తే.. అవస్థలే".. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా.. ప్రజల అసహనం

People Facing Problems with CM Tour: "ఆ చెట్లు నరికేయ్​.. ఈ డివైడర్​ తీసేయ్​.. సీఎం సారొస్తున్నారు"

Last Updated : Jul 8, 2024, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.