ETV Bharat / opinion

బ్యారేజీలు, సాగునీటి ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకం - శాపంలా మారిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన - project Safety Measures

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

YSRCP Govt Negligence on Irrigation Projects in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జలాశయాల నిర్వహణ గాలికి వదిలేశారు. డ్యాంల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు. ఏటా ప్రాజెక్ట్​ల నిర్వహణకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు.

PROJECT SAFETY MEASURES
PROJECT SAFETY MEASURES (ETV Bharat)

Pratidwani : రాష్ట్రంలోని బ్యారేజీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎంతవరకు భద్రం? ఇటీవల బెజవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటన రేకెత్తించిన ప్రశ్న ఇది. అది ప్రమాదం కాదు పనిగట్టుకుని చేసిన కుట్ర అని స్పష్టమవుతునే ఉంది. కానీ అదే సమయంలో ఐదేళ్లుగా కనీస నిర్వహణ కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో మిగిలిన ప్రాజెక్టులన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? అసలు సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉండాలి? ఐదు సంవత్సరాలుగా ఆ విషయంలో ఏం జరిగింది? ఎంత నష్టం చేశారు? ఫలితంగా ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొంటున్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఛీఫ్​ ఇంజినీర్​ డి. రామకృష్ణ, సాగునీటి సంఘాల సమాఖ్య ఆళ్ల గోపాలకృష్ణ పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వరదలకు డ్యాంలు కొట్టుకుపోయినప్పుడో నీటి తాకిడికి ప్రాజెక్ట్‌ గేటులు తెగిపోయినప్పుడో హడావుడిగా సమీక్షలు చేయడం ఆ తర్వాత దాన్ని మర్చిపోతారు. దీన్ని ఫలితంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సార్లు జగన్​ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపై విమర్శలు వచ్చాయి. క్రస్టుగేట్ల పైనుంచి వరద ప్రవహించింది. దీనివల్ల రేడియల్‌ గేట్లలో ఉండే ఇంజిస్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 39 మంది మరణించారు. 2021లో వర్షాలకు పింఛా ప్రాజెక్ట్‌ మట్టికట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్‌లపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న ఒక సాగునీటి రంగ ప్రముఖుడు సైతం తప్పుబట్టాడు.

శ్రీశైలం ప్రాజెక్టుకు జగన్​ శాపం - రూ.204 కోట్ల పనులకు గ్రహణం - YSRCP neglect on Srisailam Project

ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. స్పిల్‌వేకు ఎగువన రక్షణ కోసం నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా, తగిన సమయంలో కట్టడం పూర్తి చేయకపోవడమే గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణమని నిపుణులు తేల్చారు. 2019 జూన్‌ నాటికి పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో కొంత గ్యాప్‌ వదిలేశారు.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

Pratidwani : రాష్ట్రంలోని బ్యారేజీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎంతవరకు భద్రం? ఇటీవల బెజవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటన రేకెత్తించిన ప్రశ్న ఇది. అది ప్రమాదం కాదు పనిగట్టుకుని చేసిన కుట్ర అని స్పష్టమవుతునే ఉంది. కానీ అదే సమయంలో ఐదేళ్లుగా కనీస నిర్వహణ కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో మిగిలిన ప్రాజెక్టులన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? అసలు సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉండాలి? ఐదు సంవత్సరాలుగా ఆ విషయంలో ఏం జరిగింది? ఎంత నష్టం చేశారు? ఫలితంగా ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొంటున్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఛీఫ్​ ఇంజినీర్​ డి. రామకృష్ణ, సాగునీటి సంఘాల సమాఖ్య ఆళ్ల గోపాలకృష్ణ పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వరదలకు డ్యాంలు కొట్టుకుపోయినప్పుడో నీటి తాకిడికి ప్రాజెక్ట్‌ గేటులు తెగిపోయినప్పుడో హడావుడిగా సమీక్షలు చేయడం ఆ తర్వాత దాన్ని మర్చిపోతారు. దీన్ని ఫలితంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సార్లు జగన్​ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపై విమర్శలు వచ్చాయి. క్రస్టుగేట్ల పైనుంచి వరద ప్రవహించింది. దీనివల్ల రేడియల్‌ గేట్లలో ఉండే ఇంజిస్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 39 మంది మరణించారు. 2021లో వర్షాలకు పింఛా ప్రాజెక్ట్‌ మట్టికట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్‌లపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న ఒక సాగునీటి రంగ ప్రముఖుడు సైతం తప్పుబట్టాడు.

శ్రీశైలం ప్రాజెక్టుకు జగన్​ శాపం - రూ.204 కోట్ల పనులకు గ్రహణం - YSRCP neglect on Srisailam Project

ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. స్పిల్‌వేకు ఎగువన రక్షణ కోసం నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా, తగిన సమయంలో కట్టడం పూర్తి చేయకపోవడమే గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణమని నిపుణులు తేల్చారు. 2019 జూన్‌ నాటికి పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో కొంత గ్యాప్‌ వదిలేశారు.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.